hyderabadupdates.com Gallery ఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కం

ఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కం

ఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కం post thumbnail image

న్యూఢిల్లీ : ఏఐ ప్రయోజ‌నాల‌ను అంద‌రికీ అందుబాటులో ఉంచ‌డంలో యుఎస్, భార‌త భాగ‌స్వామ్యం కీల‌క పాత్ర పోషించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్. రెండు దేశాల మధ్య అలంకారికంగా, అక్షరాలా కనెక్షన్ పాయింట్‌గా పని చేయడం పట్ల గూగుల్ గర్వంగా ఉందని అన్నారు. ఢిల్లీలోని ఇంపాక్డ్ ఇండియా ఏఐ స‌మ్మిట్ లో సీఈవో పాల్గొని ప్ర‌సంగించారు. ఇదిలా ఉండ‌గా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. యావ‌త్ ప్ర‌పంచం ఇప్పుడు ఏఐ గురించి ఆందోళ‌న చెందుతోంద‌న్నారు. ఈ క్ర‌మంలో ప్రారంభ సెష‌న్ సంద‌ర్బంగా ఏఐ ప్రాధాన్య‌త గురించి వివ‌రించ‌డం జ‌రిగింద‌ని స్పష్టం చేశారు సుంద‌ర్ పిచాయ్. అయితే ఏఐ గురించి ఎక్కువ‌గా ఆందోళ‌న చెందుతున్నార‌ని , టెక్నాల‌జీలో ఇలాంటివి స‌ర్వ సాధార‌ణ‌మేన‌ని పేర్కొన్నారు.
ప్ర‌తి మార్పు కొత్త ప్ర‌పంచానికి నాంది ప‌లుకుతుంద‌న్నారు. ఒక‌ప్పుడు యాహూ, రీడిఫ్ డామినేట్ చేసేద‌ని కానీ గూగుల్ వ‌చ్చాక వాటిని దాటుకుని ముందుకు రావ‌డం జ‌రిగింద‌ని చెప్పారు సుంద‌ర్ పిచాయ్. అందుకే గూగుల్ ఎప్పుడూ కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప్ర‌యారిటీ ఇస్తూ వ‌స్తోంద‌న్నారు. యావ‌త్ ప్ర‌పంచంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌తిభావంతులైన వారిని గుర్తించి ప్రోత్స‌హించ‌డం మా బాధ్య‌త అని పేర్కొన్నారు. ఇప్పుడు స్టార్టప్ ల కాలం న‌డుస్తోంద‌న్నారు. ఇప్పుడు ఇండియా, అమెరికా దేశాల మ‌ధ్య వ్యాపార‌, వాణిజ్య ప‌ర‌మైన ఒప్పందాలే కాదు సాంకేతిక ప‌ర‌మైన సంబంధాలు కూడా కొన‌సాగుతున్నాయ‌న్నారు.
The post ఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

డ్ర‌గ్స్, గంజాయిపై కంట్రోల్ త‌ప్పిన స‌ర్కార్డ్ర‌గ్స్, గంజాయిపై కంట్రోల్ త‌ప్పిన స‌ర్కార్

క‌ర్నూలు జిల్లా : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ్ర‌గ్స్ , గంజాయి ల‌భ్య‌మ‌వుతోంద‌ని, యువ‌త వాటి బారిన ప‌డి జీవితాల‌ను కోల్పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వీటిని కంట్రోల్

TG High Court: గ్రూప్‌-2 రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పుTG High Court: గ్రూప్‌-2 రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు

    2015-16 గ్రూప్‌-2ను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాటి ఎంపిక జాబితాను కొట్టివేసింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా డబుల్‌ బబ్లింగ్, వైట్‌నర్‌ వినియోగం, తుడిపివేతలున్న పార్ట్‌-బి పత్రాలను

KTR: దానంనాగేందర్ పై కేటీఆర్ సెటైర్లుKTR: దానంనాగేందర్ పై కేటీఆర్ సెటైర్లు

  ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేని దానం నాగేందర్‌ను స్టార్‌ క్యాంపెయినర్‌గా పెట్టుకోవడం కాంగ్రెస్‌ దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను స్టార్‌ క్యాంపెయినర్‌గా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ ను నిలదీశారు.