hyderabadupdates.com Gallery ఒంటిమిట్ట‌లో విశిష్ట సేవ‌లు అందించిన శ్రీ‌వారి సేవకులు

ఒంటిమిట్ట‌లో విశిష్ట సేవ‌లు అందించిన శ్రీ‌వారి సేవకులు

ఒంటిమిట్ట‌లో విశిష్ట సేవ‌లు అందించిన శ్రీ‌వారి సేవకులు post thumbnail image

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. 80 వేల మందికి పైగా భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఇదే క్ర‌మంలో ఉచితంగా సేవ‌లు అందించారు శ్రీ‌వారి సేవ‌కులు. వారు అందిస్తున్న సేవ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తాజాగా ఉత్స‌వాల‌లో శ్రీవారి సేవకులు అత్యంత క్రమశిక్షణతో, భక్తి శ్రద్ధలతో విశేష సేవలందించారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు, జేఈవో వి. వీరబ్రహ్మం పర్యవేక్షణలో, సిపిఆర్ఓ డా. టి. రవి, పిఆర్ఓ (ఎఫ్‌ఏసీ) కుమారి నీలిమ ఆధ్వర్యంలో కడప పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 2,600 మంది శ్రీవారి సేవకులు వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందించారు. కల్యాణ వేదిక పరిసరాల్లో అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలను సమర్థవంతంగా నిర్వహించారు.
గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, మజ్జిగ, ఫ్రూటీ, అన్నప్రసాదాలు సమృద్ధిగా అందించారు. అదేవిధంగా శ్రీవారి లడ్డూ, ముత్యాల తలంబ్రాలు, కంకణాలు కలిగిన బ్యాగులను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేశారు. భక్తులు సులభంగా గ్యాలరీలలోకి ప్రవేశించి దర్శనం చేసుకునేలా మాడ వీధుల్లో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, గ్యాలరీలలో రద్దీని క్రమబద్ధీకరించడంలో టిటిడి అధికారులకు సేవకులు సహకారం అందించారు. శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకులు తిరునామధారణ సేవలు అందించి ఆధ్యాత్మిక భావాన్ని మరింత పెంపొందించారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపై భక్తుల నుండి అభిప్రాయాలు సేకరించారు.
శ్రీవారి సేవకులు 1.60 లక్షల ముత్యాల తలంబ్రాలను అత్యంత భక్తి భావంతో ప్యాక్ చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నుండి తీసుకు వచ్చిన సుమారు 85 వేల శ్రీవారి లడ్డూలను కల్యాణానికి విచ్చేసిన భక్తులకు పంపిణీ చేశారు. టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో సుమారు 85 వేల పులిహోర, 85 వేల కేసరి, బాదుషా, మిక్చర్, బిస్కెట్ ప్యాకెట్లను భక్తులకు అందజేశారు.
The post ఒంటిమిట్ట‌లో విశిష్ట సేవ‌లు అందించిన శ్రీ‌వారి సేవకులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి..ఆర్జిత సేవ‌లు ర‌ద్దు25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి..ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘ మాసంలో

రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందిరాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం పిచోడి చేతిలో రాయిలాగా అయి పోయింద‌న్నారు. ఇది భూసేకర కాద‌ని, దళిత బలహీన వర్గాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న దండయాత్ర అని మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం ప‌రిగి

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలిభ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

హైద‌రాబాద్ : గోదావ‌రి పుష్క‌రాల‌ను క‌నీవిని ఎరుగ‌ని రీతిలో నిర్వహించాల‌ని అన్నారు మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్. సెక్రటేరియట్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన “గోదావరి పుష్కరాలు–2027 కేబినెట్ సబ్ కమిటీ” తొలి సమావేశంజరిగింది. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్