hyderabadupdates.com Gallery కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్

కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్

కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్ post thumbnail image

ముంబై : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు రేపు జింబాబ్వేతో జ‌రిగే కీల‌క మ్యాచ్ పైనే ఉన్నాయి. దీనికి కార‌ణం భారత జ‌ట్టు ఇప్ప‌టికే డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉంది. ఈసారి కూడా టైటిల్ ఫెవ‌రేట్ గా ఉన్న‌ప్ప‌టికీ టీమిండియా ఆశించిన మేర రాణించ‌డం లేదు. టోర్నీలో భాగంగా వ‌రుస‌గా నాలుగు మ్యాచ్ ల‌లో గెలుపొంది స‌త్తా చాటినా చివ‌ర‌కు సూప‌ర్ -88లో భాగంగా జ‌రిగిన కీల‌క పోరులో బ‌ల‌మైన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుచేతిలో భారీ తేడాతో ఓట‌మి పాలైంది. ఇక ఇదే విభాగంగా ఇండియా టీం రెండు జ‌ట్ల‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇందులో భారీ తేడాతో గెలుపొందాల్సి ఉంది. మ‌రో వైపు విండీస్ టీం కూడా సూప‌ర్ షో చేస్తుండడంతో టీమిండియాకు అగ్ని ప‌రీక్ష‌గా మారింది.
ఐసీసీ బిగ్ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆశ‌లు రేపిన ఆట‌గాళ్లు ఎవ‌రూ ఆశించిన మేర రాణించ‌లేక పోయారు. అందులో ప్ర‌ధానంగా ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించే బ్యాట‌ర్లుగా పేరొందిన అభిషేక్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్ నిరాశ ప‌రిచారు. శాంస‌న్ నాలుగు మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా డ‌కౌట్ కాగా కీల‌క‌మైన సౌతాఫ్రికా తో శ‌ర్మ కేవ‌లం 15 ప‌రుగులు సాధించాడు. బోణీ కొట్టాడు. అయినా ఇది త‌న వ‌ర‌కు చూస్తే మంచి స్కోర్ కానే కాదు. ఇక సంజు శాంస‌న్ వ‌ర‌కు చూస్తే ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. నమీబియాతో జ‌రిగిన మ్యాచ్ లో 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సులు ఒక ఫోర్ తో 22 ర‌న్స్ చేశాడు. తాజాగా జింబాబ్వేతో రేపు జ‌రిగే మ్యాచ్ లో శాంస‌న్ ను వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ గా వాడుకోనున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.
The post కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Marriage in ICU: ఐసీయూలో వివాహం చేసుకున్న కొత్త జంట !Marriage in ICU: ఐసీయూలో వివాహం చేసుకున్న కొత్త జంట !

    పెళ్లి అంటే నూరేళ్ళ పంట. అందుకే దీనిని ఎన్నో కలలు, మరెన్నో కోరికలతో ఒక పండుగా చేసుకుంటారు. జీవితంలో ఒకే సారి జరిగే ఈ తంతు కోసం కోట్లు ఖర్చు చేసిన సందర్భాలు ఎన్నో. ఈ నేపథ్యంలో కేరళలోని

Rahul Gandhi: బిహార్ లో మత్సకారుడు అవతారం ఎత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌Rahul Gandhi: బిహార్ లో మత్సకారుడు అవతారం ఎత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌

Rahul Gandhi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ… అదానీ, అంబానీ చేతుల్లో కీలుబొమ్మగా మారారని కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేయగానే భయపడి పాకిస్తాన్‌తో యుద్ధాన్ని విరమించారని ఎద్దేవా

Minister Satya Kumar Yadav: ఏలూరు ఎలుకల దాడి ఘటనపై మంత్రి సీరియస్Minister Satya Kumar Yadav: ఏలూరు ఎలుకల దాడి ఘటనపై మంత్రి సీరియస్

    ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుక కరిచిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేట్