hyderabadupdates.com Gallery ఛ‌త్రప‌తి శివాజీ మ‌హారాజ్ బాట‌లో అజిత్ ప‌వార్ న‌డిచారు

ఛ‌త్రప‌తి శివాజీ మ‌హారాజ్ బాట‌లో అజిత్ ప‌వార్ న‌డిచారు

ఛ‌త్రప‌తి శివాజీ మ‌హారాజ్ బాట‌లో అజిత్ ప‌వార్ న‌డిచారు post thumbnail image

ముంబై : త‌న భ‌ర్త‌, దివంగ‌త మ‌రాఠా రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హారాజ్ బాట‌లో న‌డిచార‌ని అన్నారు భార్య, ఉప ముఖ్య‌మం్త‌రి సునేత్ర ప‌వార్. గురువారం ఛ‌త్ర‌ప‌తి జ‌యంతి సంద‌ర్బంగా శివనేరి కోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా త‌న భ‌ర్త గురించి త‌లుచుకుని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. చత్రపతి శివాజీ మహారాజ్, సాహు మహారాజ్, జ్యోతిరావు గోవిందరావు ఫూలే, బిఆర్ అంబేద్కర్ ల ఆదర్శాల ప్రకారం ఆయన జీవించారని అన్నారు. ఈ రోజు ఆత్మగౌరవం, స్వరాజ్యం, సుపరిపాలన పట్ల సంకల్పాన్ని పునరుద్ఘాటించడానికి చెందినదని అన్నారు.
నేను ఉప ముఖ్య‌మంత్రిగా సవాలుతో కూడిన సమయంలో ప్రమాణం చేశానని చెప్పారు. ఆ సమయంలో, జీజామాత నా కళ్ళ ముందు ఉంది. జీజామాత శివాజీ మహారాజ్‌కు జన్మనివ్వడమే కాకుండా, స్వరాజ్యాన్ని ఎలా స్థాపించాలో, ధైర్యంగా సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిందని అన్నారు సునేత్ర ప‌వార్. ఇది మిమ్మల్ని, నన్ను ఇద్దరినీ నడిపించే ప్రేరణ, ఇది మా పునాది కూడా అని పేర్కొన్నారు. తన జీవితాంతం అజిత్ పవార్ శివ, షాహు, ఫులే , అంబేద్కర్ ఆదర్శాల ఆధారంగా ముందుకు సాగారు. ఈ పవిత్ర భూమి నుండి నేను ఈ భావజాలం వారసత్వాన్ని ఎప్పటికీ వదులుకోనని నేను మీకు ఈ రోజు హామీ ఇస్తున్నానని ప్ర‌క‌టించారు సునేత్ర ప‌వార్. ప్రజలతో ఆయనకున్న అనురాగ బంధం చాలా బలమైనది, అంతే కాదు విడ‌దీయ రానిద‌న్నారు.
The post ఛ‌త్రప‌తి శివాజీ మ‌హారాజ్ బాట‌లో అజిత్ ప‌వార్ న‌డిచారు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తిరుమ‌ల‌లో సుప్ర‌బాత సేవ పునః ప్రారంభంతిరుమ‌ల‌లో సుప్ర‌బాత సేవ పునః ప్రారంభం

తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది. నేటి నుండి తిరుమలలో సుప్రభాత సేవ పునః ప్రారంభం అయ్యింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల ఆలయంలో

మ‌హా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ ఏర్పాట్లుమ‌హా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ ఏర్పాట్లు

శ్రీ‌శైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, స్వామి-అమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేలా ఖచ్చితమైన ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గనియా అధికారులను

PM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్‌’కి స్పూర్తి శ్రీరామచంద్రుడే – ప్రధాని మోదీPM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్‌’కి స్పూర్తి శ్రీరామచంద్రుడే – ప్రధాని మోదీ

      పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆపరేష్‌ సిందూర్‌, నక్సలిజం, జీఎస్టీ