hyderabadupdates.com Gallery మ‌త్స్య‌కారుల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

మ‌త్స్య‌కారుల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

మ‌త్స్య‌కారుల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ post thumbnail image

అమ‌రావ‌తి : మత్స్యకారుల పొట్టకొట్టేలా జగన్ రెడ్డి తెచ్చిన దుర్మార్గమైన జీవో నంబర్ 217ను రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ మేర‌కు వేలాది మంది గంగ‌పుత్రుల‌కు మేలు చేకూరేలా నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలిపారు రాష్ట్ర మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. శ‌నివారం మంగ‌ళ‌గిరి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం గాలికొదిలేసిన 18 గస్తీ బోట్లను యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేయించడం జ‌రిగింద‌న్నారు. అంతే కాకుండా తమిళనాడు బోట్ల చొరబాటుకు చెక్ పెట్టామ‌న్నారు. జివ్వలదిన్న హార్బర్‌లో వస్తున్న షిప్ బిల్డింగ్ పరిశ్రమ ద్వారా మత్స్యకార యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు ల‌భిస్తాయ‌ని చెప్పారు.
ఆంధ్రరాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, నాడు ఎన్టీఆర్ నుండి నేడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వరకు అదే బాటలో నడుస్తున్నారని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మత్స్యకారుల పొట్టకొట్టిన చరిత్ర వైసీపీదేనని, ఈరోజు వారు కారుస్తున్నవి ‘ముసలి కన్నీరు’ అని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో తమిళనాడు బోట్ల చొరబాటు అనేది దశాబ్దాల సమస్య అని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి 18 కోస్ట్ గార్డ్ బోట్లను రాష్ట్రానికి తీసుకు వచ్చార‌ని తెలిపారు. కానీ, 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం ఆ బోట్ల మెయింటెనెన్స్‌ను పూర్తిగా గాలికొదిలేయడం వల్ల అవన్నీ రిపేర్లకు గురై మూలన పడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి వెంటనే స్పందించి నిధులు కేటాయించారని చెప్పారు.
The post మ‌త్స్య‌కారుల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ పై క‌విత క‌న్నెర్ర‌హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ పై క‌విత క‌న్నెర్ర‌

హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సీరియ‌స్ అయ్యారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ లోని సంస్థ కార్యాల‌యంలో క‌విత మీడియాతో మాట్లాడారు. త‌న‌పై ప‌రువు

బ్ర‌హ్మోత్స‌వాల‌కు డిప్యూటీ సీఎంకు ఆహ్వానంబ్ర‌హ్మోత్స‌వాల‌కు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం

చిత్తూరు జిల్లా : దేశంలో పేరు పొందిన శైవ క్షేత్రాల‌లో ఒక‌టిగా గుర్తింపు పొందింది. భ‌క్తుల‌తో అల‌రారుతోంది చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆల‌యం. ఈనెల‌లో శివ రాత్రి ప‌ర్వ‌దినం జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆల‌య

పంజాబ్ కింగ్స్ షాన్ దార్ షోపంజాబ్ కింగ్స్ షాన్ దార్ షో

ముల్లాన్ పూర్ : ఐపీఎల్ 2026లో హాట్ ఫెవ‌రేట్ గా బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ స‌త్తా చాటింది. త‌న తొలి మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఆల్ రౌండ్ షోతో దుమ్ము రేపింది.