hyderabadupdates.com Gallery రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌

రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌

రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌ post thumbnail image

హైద‌రాబాద్ : అంద‌రి దృష్టి మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ , జాహ్న‌వి క‌పూర్ క‌లిసి న‌టించిన చిత్రం పెద్ది. దీనికి ఉప్పెన ఫేమ్ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ ఖ‌ర్చు పెట్టారు ఈ మూవీ కోసం. ఇప్ప‌టికే సంగీతం అందించిన ఏఆర్ రెహ‌మాన్ సినిమాకు ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా మారింది. త‌ను స్వ‌ర ప‌రిచిన చికిరి చికిరి సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ త‌రుణంలో పెద్ది మూవీ రిలీజ్ పై ఉత్కంఠ నెల‌కొంది. త‌న బాబాయ్ ప‌వ‌ర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సైతం పెద్దితో పాటు విడుద‌ల కానుంద‌ని టాక్.
దీంతో ప‌వ‌ర్ స్టార్ మూవీ కోసం త‌మ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. దీనికి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌రో వైపు పెద్ది సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన గ్లింప్స్, చిత్రాలు సంచ‌ల‌నం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం చికిరి ట్రెండింగ్ లో కొన‌సాగుతూనే ఉంది. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. దేఖ్ లేంగే సాలా అనే సాంగ్ దుమ్ము రేపుతోంది. సామాజిక మాధ్య‌మాల‌ను షేక్ చేస్తోంది. ఈ పాట‌ను త‌న దివంగ‌త తండ్రి స‌త్యానంద్ కు అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు రాక్ స్టార్. మొత్తంగా ఎన్ని సినిమాలు వ‌చ్చినా రాబోయే పెద్దిపై అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.
The post రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

NIA: ‘ఎన్‌ఐఏ’కు దిల్లీ పేలుడు కేసుNIA: ‘ఎన్‌ఐఏ’కు దిల్లీ పేలుడు కేసు

  దిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ‘ఎన్‌ఐఏ’ ఉగ్రవాద సంబంధిత కేసులను

సృజ‌నాత్మ‌క ఆర్థిక వ్య‌వ‌స్థ ద్వారా ఉపాధిసృజ‌నాత్మ‌క ఆర్థిక వ్య‌వ‌స్థ ద్వారా ఉపాధి

విజ‌యవాడ : పవిత్ర కృష్ణా నది తీరాన ప్రారంభమైన ‘ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్’ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలవనుందని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. విజయవాడలో జరిగిన ఈ ఉత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కనుమరుగవుతున్న