hyderabadupdates.com Gallery శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం

శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం

శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం
ఎన్డీఏ నేతలతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అని అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం అని చెప్పారు . గత పాలనలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చోటు చేసుకుందని అన్నారు సీఎం. 2003లో టీటీడీలో ప్రాణదానం కార్యక్రమం చేపట్టాం అన్నారు. శ్రీవారి కృపతోనే 23 క్లైమోర్ మైన్స్ దాడి నుంచి బయపడ్డానని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన పునర్జన్మ అది అని పేర్కొన్నారు. ఏడు కొండలవాడికి రెండు కొండలు చాలు అన్న వ్యక్తులు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
గత పాలనలో అంతర్వేది రథం తగలబెడితే, రామతీర్ధంలో విగ్రహం ధ్వంసం చేస్తే చర్యలు తీసుకోకుండా తిరిగి మాపైనే ఆరోపణలు చేశారని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. 2022లో సీఎఫ్‌టీఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతోందని చెప్పినా పట్టించు కోకుండా యదేఛ్చగా కొనసాగించారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో ప్రక్షాళన చేయటంలో భాగంగా లడ్డూ శాంపిళ్లు తీసి ఎన్డీడీబీకి పంపామ‌ని తెలిపారు. సిట్ నివేదిక చూస్తే అన్ని రసాయనాలు, పామాయిల్‌తో నెయ్యి తయారు చేసినట్టు వెలుగు చూసిందన్నారు. భగవంతుడు అంటే లెక్కలేని తనంగా వ్యవహరించారని పేర్కొన్నారు సీఎం. హైందవం పట్ల ఆయనకు విశ్వాసం లేకపోతే ఇలా చేస్తారా అని ప్ర‌శ్నించారు ముఖ్య‌మంత్రి.
The post శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Nara Lokesh: భారత్‌ లో పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారింది – మంత్రి లోకేశ్‌Minister Nara Lokesh: భారత్‌ లో పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారింది – మంత్రి లోకేశ్‌

    భారత్-ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఏపీది కీలక పాత్ర అని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా ఉందన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేశ్‌.. బ్రిస్బేన్‌ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య

Tollywood Megastar Chiranjeevi Secures Legal Protection for Personal RightsTollywood Megastar Chiranjeevi Secures Legal Protection for Personal Rights

Senior Tollywood actor and megastar Chiranjeevi has won a crucial interim order at the Hyderabad City Civil Court, preventing the unauthorized use of his name, photographs, and titles for commercial

CP Radhakrishnan: సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి అగ్రస్థానానికి భారత్‌ – ఉప రాష్ట్రపతిCP Radhakrishnan: సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి అగ్రస్థానానికి భారత్‌ – ఉప రాష్ట్రపతి

    సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి భారత్‌ అగ్రస్థానానికి చేరుతుందని ఆశిస్తున్నట్టు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ తెలిపారు. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 44వ స్నాతకోత్సవంలో ఉప రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘‘నవంబర్‌ 22 విశిష్టత గురించి