hyderabadupdates.com Gallery శ్రీవారి వైద్య సేవకులకు సౌకర్యాలపై చర్యలు

శ్రీవారి వైద్య సేవకులకు సౌకర్యాలపై చర్యలు

శ్రీవారి వైద్య సేవకులకు సౌకర్యాలపై చర్యలు post thumbnail image

తిరుపతి : టిటిడిలో త్వరలో ప్రారంభించనున్న శ్రీవారి వైద్య సేవకులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై చర్యలు చేపట్టినట్లు టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ వెల్లడించారు. ఎస్వీ ఆయుర్వేద వైద్యశాల, స్విమ్స్, ఎస్వీ వేదిక్ యూనివర్శిటీలోని అవసరమైన భవనాల నవనీకరణలో భాగంగా అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టిటిడిలో శ్రీవారి వైద్య సేవకు అవసరమైన వైద్య రంగంలోని వివిధ విభాగాల నిపుణులకు వసతి సౌకర్యం కల్పించేందుకు వీలుగా ఎస్వీ ఆయుర్వేద వైద్యశాల, స్విమ్స్, ఎస్వీ వేదిక్ యూనివర్శిటీలోని వసతి గదులను పరిశీలించామన్నారు. సంబంధిత వైద్యులు వైద్య సేవ చేసేందుకు వీలుగా వారం రోజుల పాటు బస చేసేందుకు వసతి గదుల నవనీకరణ, మౌళిక సౌకర్యాలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
తిరుపతి, తిరుమలలో ఉన్న టీటీడీ ఆస్పత్రుల్లో ముఖ్యంగా అశ్వినీ ఆసుపత్రి, ఆయుర్వేద, స్విమ్స్, బర్డ్, చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రోగులకు సేవ చేసేందుకు శ్రీవారి వైద్య సేవను త్వరలోనే ప్రారంభించేందుకు వీలుగా చర్యలు చేపట్టామన్నారు. వైద్య రంగానికి చెందిన వివిధ విభాగాల వైద్య నిపుణులు సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని జేఈవో తెలిపారు. ఇప్పటికే టిటిడిలోని వివిధ విభాగాలలో శ్రీవారి సేవకులు వారం రోజులకు గాను 4 వేల మంది శ్రీవారి సేవకులు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని చెప్పారు. దాదాపు 17 లక్షలకు పైగా శ్రీవారి సేవకులు సేవలు అందించారన్నారు. శ్రీవారి సేవను వైద్య, విద్య, ఐటీ రంగాలకు విస్తరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీఎంఓ డా. కుసుమ కుమారి, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డా. రేణు దీక్షిత్, బర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ డా. వెంకట రెడ్డి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా.రామ్, ఎస్‌ఈలు వేంకటేశ్వర్లు, మనోహరం, నరసింహ మూర్తి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్, వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
The post శ్రీవారి వైద్య సేవకులకు సౌకర్యాలపై చర్యలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Mother: ఇన్సురెన్స్ డబ్బుల కోసం లవర్‌ తో కలిసి కొడుకును చంపేసిన తల్లిMother: ఇన్సురెన్స్ డబ్బుల కోసం లవర్‌ తో కలిసి కొడుకును చంపేసిన తల్లి

Mother : సాధారణంగా ప్రతీ తల్లి తన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. బిడ్డల కోసం తన సంతోషాన్ని పక్కన పెడుతుంది. తను పస్తులు ఉండి బిడ్డల ఆకలి తీరుస్తుంది. కానీ కాన్పూర్ లో ఓ తల్లి (Mother) అత్యంత క్రూరంగా

Kaveri Travels: కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యంKaveri Travels: కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యం

    కర్నూలు బస్సు ప్రమాదంపై తీవ్ర విమర్శల వేళ… వీ కావేరి ట్రావెల్స్ యాజమాన్యం స్పందించింది. బస్సుకు ఫిట్‌నెస్‌ లేదని, పైగా సర్టిఫికెట్లు కూడా కాలపరిమితి చెల్లాయని, అపరిమిత చలాన్లూ ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తమ

ReNew Energy Global: రూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులకు కుదిరిన ఒప్పందాలుReNew Energy Global: రూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులకు కుదిరిన ఒప్పందాలు

  గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు భారీ పెట్టుబడులతో తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖలో 14, 15 తేదీల్లో జరిగే 30వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సమావేశాలకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. పునరుత్పాదక విద్యుత్ రంగంలో