hyderabadupdates.com Gallery సంజు శాంస‌న్ ఎంపిక‌పై గౌత‌మ్ గంభీర్ మౌనం

సంజు శాంస‌న్ ఎంపిక‌పై గౌత‌మ్ గంభీర్ మౌనం

సంజు శాంస‌న్ ఎంపిక‌పై గౌత‌మ్ గంభీర్ మౌనం post thumbnail image

గుజ‌రాత్ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ను టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా ఆదివారం గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగే కీల‌క మ్యాచ్ లో ఆడిస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. దీనిపై ఇంకా మౌనం వ‌హించ‌డం ప‌ట్ల హెడ్ కోచ్ గౌతం గంభీర్ పై మండిప‌డుతున్నారు శాంస‌న్ అభిమానులు. సూపర్ 8 మ్యాచ్‌లలో భాగంగా ఈ కీల‌క మ్యాచ్ భార‌త జ‌ట్టుకు అత్యంత కీల‌కం. ప్ర‌స్తుతం టీం ఇండియా తీవ్ర స‌మస్య‌ను ఎదుర్కొంటోంది. ప్ర‌త్యేకించి ఓపెన‌ర్లుగా ఇద్ద‌రిని ప్రయోగించింది మేనేజ్మెంట్. ఓపెన‌ర్లు గా అభిషేక్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్ ఆశించిన మేర రాణించ‌లేదు.
మొత్తం ఎనిమిది మ్యాచ్ లు ఆడితే 5 మ్యాచ్ ల‌లో శ‌ర్మ డ‌కౌట్ అయ్యాడు. మ‌రో వైపు న‌మీబియాతో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు శాంస‌న్. కేవ‌లం ఎనిమిది బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. ఇందులో మూడు సిక్సుల‌తో పాటు ఒక ఫోర్ కొట్టాడు. 22 ప‌రుగులు చేశాడు. 272 స్ట్రైక్ రేట్ తో ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత జ‌రిగిన మ్యాచ్ ల నుంచి ఆడ‌కుండా త‌ప్పించారు. కేవ‌లం త‌న‌ను బెంచ్ కే ప‌రిమితం చేశాడు. తాజాగా క్రికెట్ వ‌ర్గాల నుంచి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోంది సంజు శాంస‌న్. మ‌రో వైపు తిల‌క్ వ‌ర్మ ను తీసేసి శాంస‌న్ కు ఛాన్స్ ఇస్తున్న‌ట్లు టాక్. ఇదిలా ఉండ‌గా అహ్మ‌దాబాద్ లో సంజు శాంస‌న్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ వ‌చ్చాడు. దీన్ని బ‌ట్టి త‌న‌ను తుది జ‌ట్టుకు ఎంపిక చేస్తార‌ని స‌మాచారం.
The post సంజు శాంస‌న్ ఎంపిక‌పై గౌత‌మ్ గంభీర్ మౌనం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ ష‌ర్మిలఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ ష‌ర్మిల

అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ స‌ర్కార్ తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్ పై స్పందించారు. కొత్త సీసాలో పాత సారా సామెతను తలపించిందని అన్నారు. అంతా ఊహా

దేవుడి పేరుతో కూట‌మి స‌ర్కార్ రాజ‌కీయందేవుడి పేరుతో కూట‌మి స‌ర్కార్ రాజ‌కీయం

తాడేపల్లి గూడెం : మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో గత మా ప్రభుత్వంపై వేసిన నిందను సమర్థించు కునేందుకు, ఒక తప్పును ఒప్పు అని చెప్పేందుకే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైందని ధ్వజమెత్తారు. తిరుమల