hyderabadupdates.com Gallery సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్

సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్

సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్ post thumbnail image

హైద‌రాబాద్ : మిర్యాల‌గూడ వేదిక‌గా జ‌ర‌గిన బ‌హిరంగ స‌భ‌లో త‌న తండ్రి, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. గ‌రువారం కేటీఆర్ సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. తెలంగాణ స‌మాజం రేవంత్ రెడ్డి వాడుతున్న భాష‌ను చూసి సిగ్గు ప‌డుతోంద‌న్నారు. అయినా సోయి లేకుండా ఇష్టానుసారంగా ఎలా ప‌డితే అలా మాట్లాడ‌టం దారుణ‌మన్నారు. త‌ను ఏం మాట్లాడుతున్నాడో త‌న‌కే తెలియ‌డం లేద‌న్నారు. మెద‌డులో చిప్ దొబ్బిన‌ట్టు ఉందంటూ అనుమానం వ్య‌క్తం చేశారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నోట్లో నుంచి పాలసీలు రావు, పథకాలు వినిపించవని కేవ‌లం వ‌చ్చేది మాత్రం మురికి భాష త‌ప్ప మ‌రోటి రాద‌న్నారు.
హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీలో ఐదు రోఉలు కాదు 500 రోజుల పాటు కోర్సులు చేసినా రేవంత్ రెడ్డి వ్య‌క్తిత్వం మార‌ద‌న్నారు. బూతు భాష త‌ప్పా త‌న‌కు ఏదీ రాద‌న్నారు. ఎన్ని కోర్సులు చ‌దివితే ఏం లాభం. సంస్కారం అనేది లేక పోతే అని మండిప‌డ్డారు. తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టి, ఉద్యమాల్ని నడిపి, రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణకు బాటలు వేసిన కేసీఆర్ ను ఉద్దేశించి వ్య‌క్తిగ‌తంగా కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర స్తాయిలో మండిప‌డ్డారు కేటీఆర్. ప్ర‌జ‌లు నిన్ను క్ష‌మించ‌ర‌ని, రాబోయే రోజుల్లో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌ని అన్నారు. అధికారం ఉంది క‌దా అని విర్ర‌వీగితే రేపొద్దున ప‌వ‌ర్ పోయే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు.
The post సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

TTD: మంగళూరులో శ్రీవారి ఆలయానికి భూమి మంజూరు చేసిన ప్రభుత్వంTTD: మంగళూరులో శ్రీవారి ఆలయానికి భూమి మంజూరు చేసిన ప్రభుత్వం

TTD : దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరులోనూ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్‌ అన్నారు. బెంగళూరు వయ్యాలికావల్‌లోని టీటీడీ (TTD) ఆలయంలో గురువారం 2026 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్‌లు, డైరీలను

రెండు వేర్వేరు కేసుల‌పై పై సిట్ ఏర్పాటురెండు వేర్వేరు కేసుల‌పై పై సిట్ ఏర్పాటు

హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ శివ ధ‌ర్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రెండు వేర్వేరు కేసుల‌కు సంబంధించి సిట్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. దీనికి సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలిపారు. మంగ‌ళ‌వారం డీజీపీ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్

Minister Kishanreddy: వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం – కిషన్‌రెడ్డిMinister Kishanreddy: వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం – కిషన్‌రెడ్డి

    బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘‘ కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో ఏం చేయగలడు. సుప్రీంకోర్టు తీర్పునకు