hyderabadupdates.com Gallery స్పీక‌ర్ నిర్వాకం జ‌గ‌దీశ్ రెడ్డి ఆగ్ర‌హం

స్పీక‌ర్ నిర్వాకం జ‌గ‌దీశ్ రెడ్డి ఆగ్ర‌హం

స్పీక‌ర్ నిర్వాకం జ‌గ‌దీశ్ రెడ్డి ఆగ్ర‌హం post thumbnail image

హైద‌రాబాద్ : ఫిరాయింపు ఎమ్మెల్యేల విష‌యంలో స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. స్పీక‌ర్ న్యాయ బద్ధంగా పని చేయడం లేద‌ని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపు దారులను స్పీకర్ వదిలినా కోర్టుల్లో శిక్ష తప్పద‌ని హెచ్చ‌రించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన ఫిర్యాదును గ‌డ్డంప్ర‌సాద్ కుమార్ డిస్మిస్ చేయ‌డం అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్న ఫిరాయింపుదారులు స్పీకర్ కి కనపడ కపోవడం విచారకరం అన్నారు. ఇంత‌కు త‌ను క‌ళ్లుండి క‌బోధిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జ‌గ‌దీశ్ రెడ్డి.
స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ చర్యల పట్ల ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అని ధీమా వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే లు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నది కనబడక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. బహిరంగంగా సభలకు, కాంగ్రెస్ కార్యక్రమాలకు హాజరువుతూనే మ‌రో వైపు తాను కాంగ్రెస్ పార్టీల చేర‌లేద‌ని చెప్ప‌డం సిగ్గుచేటు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి స్పీక‌ర్ స‌రిగ్గా నిర్ణ‌యం తీసుకోలేక పోతున్నాడ‌ని వాపోయారు. ఆద‌ర్శ ప్రాయంగా నిల‌వాల్సిన గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ స్పీక‌ర్ ప‌ద‌వికి చేటు తీసుకు వ‌చ్చేలా చేశాడ‌ని మండిప‌డ్డారు జ‌గ‌దీశ్ రెడ్డి.
The post స్పీక‌ర్ నిర్వాకం జ‌గ‌దీశ్ రెడ్డి ఆగ్ర‌హం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

PM Narendra Modi: బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీPM Narendra Modi: బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ

    బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అటు ఎన్డీయే.. ఇటు ఇండియా బ్లాక్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సమస్తీపుర్ జిల్లాలోని కర్పూరీ గ్రామం అందుకు వేదికైంది. బిహార్‌ మాజీ సీఎం, దివంగత

గ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతిగ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి

ఢిల్లీ : మొజాంబిక‌న్ సామాజిక కార్య‌క‌ర్త గ్రాకా మాచెల్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌న‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇందిరాగాంధీ శాంతి బహుమ‌తి ద‌క్కింది. ఇదిలా ఉండగా గ్రాకా మాచెల్ విద్య , ఆరోగ్యంలో విశేషంగా కృషి చేశారు. 2025 ఇందిరా