hyderabadupdates.com Gallery అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప‌థ‌కంతో భ‌రోసా

అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప‌థ‌కంతో భ‌రోసా

అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప‌థ‌కంతో భ‌రోసా post thumbnail image

అమ‌రావ‌తి : రైతు భరోసా పేరుతో గత ప్రభుత్వం 2019–24 మధ్య అర్హులైన భూయజమాని కుటుంబాలకు సంవత్సరానికి రూ.13,500 ఇస్తామని ప్రకటించి, వాస్తవానికి రాష్ట్రం వాటాగా కేవలం రూ.7,500 మాత్రమే అందించిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.6,000ను కూడా తమవేనని చూపిస్తూ రైతులను తప్పుదారి పట్టించారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం “సూపర్ సిక్స్”లో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు. అర్హత కలిగిన భూయజమానులు, అటవీ భూమి సాగుదారులకు మూడు విడతల్లో రాష్ట్రం నుంచి రూ.14,000 మరియు కేంద్రం నుంచి రూ.6,000 చొప్పున అందజేస్తున్నారని తెలిపారు.
భూమిలేని సాగుదారులకు కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచే సంవత్సరానికి రూ.20,000 రెండు విడతల్లో చెల్లిస్తున్నామ‌న్నారు అచ్చెన్నాయుడు. 2025–26లో ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రెండు విడతల్లో కలిపి రూ.6,309.44 కోట్లు (రాష్ట్రం రూ.4,685.84 కోట్లు; కేంద్రం రూ.1,623.60 కోట్లు) 46.86 లక్షల రైతు కుటుంబాలకు పంపిణీ చేశామ‌న్నారు. అర్హత ఉన్నవారు మిగిలి పోకుండా గ్రీవెన్స్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. 2026–27 సంవత్సరానికి మొత్తం రూ.9,700 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని వెల్లడించారు అచ్చెన్నాయుడు.
దీని వలన రాష్ట్రంలోని పంట భూములు న్యూట్రియంట్ సమతౌల్యం ఏర్పడి పంట ఉత్పత్తి , ఉత్పాదకత పెరగటం ద్వారా రైతుల ఆదాయాలు పెరిగాయన్నారు. అదే వైసీపీ హయాంలో 2019-2024 మధ్య కాలంలో కేవలం ఒక్క 2019-20 సంవత్సరంలో మాత్రమే రూ.31.35 కోట్లు సబ్సిడీ వ్యయంతో 31,859 టన్నుల సూక్ష్మపోషకాలు 1.47 లక్షల మంది రైతులకు మాత్రమే, అదికూడా రాయితీని 100% నుండి 70% కి తగ్గింఛి పంపిణీ చేశార‌ని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 2025-26 రబీ సీజన్ కోసం సబ్సిడీపై సూక్ష్మ పోషకాల సరఫరాకు 16.17 కోట్ల రూపాయలు ఖర్చు చేశామ‌న్నారు.
The post అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప‌థ‌కంతో భ‌రోసా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

Vande Bharat : భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్‌ రానుంది. వందేభారత్‌ 4.0 (Vande Bharat)ను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) బుధవారం ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని వెల్లడించారు.

Supreme Court: లాయర్ రాకేష్‌ కిషోర్‌ పై సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చSupreme Court: లాయర్ రాకేష్‌ కిషోర్‌ పై సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చ

Supreme Court : తనపై షూ విసిరిన లాయర్‌(సస్పెండెడ్‌) రాకేష్‌ కిషోర్‌ (Rakesh Kishore) ను భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌ క్షమించినా… న్యాయ వ్యవస్థ మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆయనపై కోర్టు ధిక్కరణ కింద క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించాలని

ప్ర‌భాస్ రాజా సాబ్ త‌ప్ప‌కుండా హిట్ అవుతుందిప్ర‌భాస్ రాజా సాబ్ త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది

హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు మారుతి సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. ప్ర‌భాస్ , మాళ‌విక మోహ‌న్, రిద్దీ కుమార్, నిధి అగ‌ర్వాల్ , సంజ‌య్ ద‌త్ తో క‌లిసి ది రాజా సాబ్ తీశాడు. దీనిని పీపుల్స్ మీడియా నిర్మించింది. భారీ బడ్జెట్