అమెరికా : భారత సంతతికి చెందిన మహిళ మంగళ కుప్పాకు అరుదైన , కీలకమైన పదవి దక్కింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యున్నమైన కార్మిక శాఖకు సీఐఓగా బాధ్యతలు అప్పగించింది. మంగళ కుప్పా ఏజెన్సీ అంతటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యూహం, డిజిటల్ పరివర్తన , ఏఐ వినియోగాన్ని పర్యవేక్షిస్తారు. గత ఏడాది అక్టోబర్ నుంచి తాత్కాలిక హోదాలో పనిచేసిన తర్వాత, యూఎస్ కార్మిక శాఖకు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐఓ)గా నియమితులయ్యారు. దీంతో ఆమె పాత్ర అధికారికమైంది. ఆ శాఖకు చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా కూడా పనిచేస్తున్న కుప్పా, ఈ నెల ప్రారంభంలో నియమితులయ్యారు.
ఆమె ఏజెన్సీ అంతటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యూహం, డిజిటల్ పరివర్తన, ఏఐ వినియోగాన్ని పర్యవేక్షించడం కొనసాగిస్తారు. ఈ సందర్బంగా లింక్డ్ ఇన్ లో స్పందించారు. సేవ చేస్తూ, మార్పు తీసుకువచ్చే అవకాశం లభించినందుకు కృతజ్ఞురాలిని అని మంగళ కుప్పా. 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది ఆమెకు . టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ అయిన కుప్పా, ఎంటర్ప్రైజ్ ఏఐ వ్యూహాన్ని అభివృద్ధి చేయడం, డేటా ప్లాట్ఫారమ్లను విస్తరించడం, సైబర్సెక్యూరిటీ వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి అంశాలతో సహా, ఆధునీకరణ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె 2010లో కార్మిక శాఖలో చేరారు . అప్పటి నుండి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ,డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్తో సహా అనేక ఉన్నత పదవులను నిర్వహించారు. అంతకు ముందు ఆమె బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్లో దశాబ్దానికి పైగా పనిచేశారు. భారతదేశానికి చెందిన కుప్పా, ఎస్ఎన్డిటి మహిళా విశ్వ విద్యాలయంలో చదువుకున్నారు.
The post అమెరికా కార్మిక శాఖ సీఐఓగా మంగళ కుప్పా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
అమెరికా కార్మిక శాఖ సీఐఓగా మంగళ కుప్పా
Categories: