hyderabadupdates.com Gallery ఆరోగ్య‌శ్రీ‌ని చంపేసేందుకు కూట‌మి స‌ర్కార్ కుట్ర‌

ఆరోగ్య‌శ్రీ‌ని చంపేసేందుకు కూట‌మి స‌ర్కార్ కుట్ర‌

ఆరోగ్య‌శ్రీ‌ని చంపేసేందుకు కూట‌మి స‌ర్కార్ కుట్ర‌ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె కూట‌మి స‌ర్కార్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 2.5 లక్షల ఆరోగ్య భీమా పచ్చి మోసం అన్నారు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అంతా బూటకం అంటూ మండిప‌డ్డారు. ఇది ఆరోగ్యశ్రీని పూర్తిగా చంపే కుట్ర త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు . పేదోడి సంజీవనిని ప్రైవేట్ పరం చేసేందుకే UHC అంటూ డ్రామాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. వైద్యం మీద ప్రభుత్వ భ‌రోసాను లేకుండా చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ష‌ర్మిలా రెడ్డి. ప్రైవేట్ భీమా పేరుతో ఆరోగ్యశ్రీని భ్ర‌ష్టు పట్టిస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఉద్దేశ్య పూర్వకంగా ఆరోగ్యశ్రీ ని అనారోగ్య శ్రీ గా మార్చుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రైవేట్ భీమా భారం తప్పా, లాభం లేదని తెలిసినా చంద్రబాబుకు UHC మీద ప్రేమ చావడం లేదని అన్నారు. ట్రస్ట్ విధానంలోనే ఆరోగ్యానికి భరోసా అని తెలిసినా ఇన్స్యూరెన్స్ కంపెనీలకు రాష్ట్ర ఖజానా దోచిపెట్టాలని చూడటం దుర్మార్గం అని భ‌గ్గుమ‌న్నారు ష‌ర్మిలా రెడ్డి.
పేద ప్రజల ప్రాణాలు కాపాడే ఆరోగ్యశ్రీపై ఇన్ని కుట్రలు ఎందుకు? ఎవరిపై ఈ కక్ష? ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని తీవ్ర స్తాయిలో మండిప‌డ్డారు. ఏడాదికి ఆరోగ్యశ్రీ కింద రూ.4వేల కోట్లు చెల్లింపులకు మనసు రాని ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ కంపెనీలకు ముందే దోచిపెట్టడానికి వేల కోట్లు ఎక్కడ నుంచి వస్తాయంటూ నిల‌దీశారు. ప్రభుత్వం అమలు చేసే ఆరోగ్యశ్రీ విధానాలకు, ప్రైవేట్ భీమా పెట్టే కండిషన్లకు పొంతన ఎక్కడిది ? రూ.2.5 లక్షల లోపు ఆరోగ్య బీమా ఏంటి… ఆపై ఖర్చును ట్రస్ట్ చెల్లించడం ఏంటి? ప్రైవేట్ బీమా అమలు చేసిన రాష్ట్రాలు ప్రభుత్వ ట్రస్ట్ విధానానికి మార్చుకుంటుంటే, ట్రస్ట్ విధానంలో నడిచే మన రాష్ట్రంలో ప్రైవేట్ బీమాను ప్రారంభించడంలో ఆంతర్యం ఏంటో చంద్రబాబు చెప్పాలని అన్నారు. ఆరోగ్య శ్రీ కాదని ప్రైవేట్ భీమా పెట్టడం ద్వారా జరిగే లాభం ఏంటో సమాధానం చెప్పాలన్నారు.
The post ఆరోగ్య‌శ్రీ‌ని చంపేసేందుకు కూట‌మి స‌ర్కార్ కుట్ర‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏం ఉద్ద‌రించార‌ని సావ‌ర్క‌ర్ కు భార‌త‌ర‌త్న ఇవ్వాలి..?ఏం ఉద్ద‌రించార‌ని సావ‌ర్క‌ర్ కు భార‌త‌ర‌త్న ఇవ్వాలి..?

న్యూఢిల్లీ : ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. మ‌రాఠా వేదిక‌గా జ‌రిగిన ఆర్ఎస్ఎస్ 100వ సంవ‌త్స‌రం సంద‌ర్బంగా నిర్వ‌హించిన కీల‌క స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వీర సావ‌ర్క‌ర్ కు కేంద్ర స‌ర్కార్

TG Panchayat Elections: తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందిTG Panchayat Elections: తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది

    తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల అయింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని మంగళవారం సాయంత్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘తెలంగాణలో కోటి 66 లక్షలకు

PM Narendra Modi: దిల్లీ పేలుడు ఘటన బాధితులకు ప్రధాని మోదీ పరామర్శPM Narendra Modi: దిల్లీ పేలుడు ఘటన బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ

    దిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న కారు పేలుడు ఘటనలో గాయపడిన వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న వెంటనే నేరుగా ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి వెళ్లారు. గాయపడిన వారితో మాట్లాడి, త్వరగా కోలుకోవాలని