hyderabadupdates.com Gallery ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సంద‌ర్శించిన బిల్ గేట్స్

ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సంద‌ర్శించిన బిల్ గేట్స్

ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సంద‌ర్శించిన బిల్ గేట్స్ post thumbnail image

అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సోమ‌వారం సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్. పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్‌కు వివరించారు సీఎం. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు ఈ సంద‌ర్భంగా బిల్ గేట్స్. ఆర్టీజీఎస్‌లోని డిస్ ప్లే వాల్స్‌పై ప్రజంటేషన్లను పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని వివరించారు. డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందన్నారు గేట్స్. . అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమారాచాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గేట్స్‌కు తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు తెలిపారు నారా చంద్ర‌బాబు నాయుడు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు బిల్ గేట్స్. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని,, అలాగే, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసించారు గేట్స్. జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగాయ‌ని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు.
The post ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సంద‌ర్శించిన బిల్ గేట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఇండియాకు ఎప్పుడు వ‌స్తానో చెప్ప‌లేనుఇండియాకు ఎప్పుడు వ‌స్తానో చెప్ప‌లేను

ముంబై : మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఇరుక్కున్న ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త విజ‌య్ మాల్యా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎప్పుడు ఇండియాకు వ‌స్తానో తెలియద‌ని అన్నారు. త‌న‌కు రావాలంటే ఇక్క‌డ పాస్ పోర్టు రావాల్సి ఉంటుంద‌న్నారు. కానీ అది దొర‌క‌డం లేద‌న్నారు.

Minister Vivek: వివేక్‌, హరీశ్‌ రావుల మధ్య మాటల యుద్ధంMinister Vivek: వివేక్‌, హరీశ్‌ రావుల మధ్య మాటల యుద్ధం

Minister Vivek : ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలపై మంత్రి గడ్డం వివేక్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. సిద్దిపేట కలెక్టరేట్‌లో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

CM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహంCM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహం

CM Siddaramaiah : కర్ణాటకలో జరుగుతున్న సోషల్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే కు దూరంగా ఉండాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (CM Siddaramaiah) ఘాటుగా స్పందించారు.