hyderabadupdates.com Gallery ఆ స‌మ‌యంలో జుబీన్ గార్గ మ‌ద్యం మ‌త్తులో ఉన్నాడు

ఆ స‌మ‌యంలో జుబీన్ గార్గ మ‌ద్యం మ‌త్తులో ఉన్నాడు

ఆ స‌మ‌యంలో జుబీన్ గార్గ మ‌ద్యం మ‌త్తులో ఉన్నాడు post thumbnail image

సింగ‌పూర్ : అస్సాంకు చెందిన ప్ర‌ముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సింగ‌పూర్ లో త‌న క‌చేరి నిర్వ‌హించేందుక‌ని వెళ్లి అనుమానాస్ప‌ద మృతికి గుర‌య్యాడు. ఇందుకు సంబంధించి విచార‌ణ‌కు ఆదేశించింది ఆ రాష్ట్ర స‌ర్కార్. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు సీఎం హిమంత బిస్వ‌. అంతే కాకుండా ఈ భూమి పుత్రుడికి నివాళులు అర్పిస్తూ వేలాది మంది జ‌నం క‌డ‌దాకా వ‌చ్చారు. వీధుల‌న్నీ నిండి పోయాయి. క‌న్నీళ్ల‌తో వీడ్కోలు ప‌లికారు. బ‌హుషా ఆ రాష్ట్రం లో భూపేన్ హ‌జ‌రికా త‌ర్వాత అంత‌గా నివాళి అందుకున్న గాయ‌కుడు జుబీన్ గార్గ్ మాత్ర‌మే. ఈ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఈ కేసుకు సంబంధించి ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా ఊహించ‌ని విధంగా సింగ‌పూర్ పోలీసులు ఇవాళ కోర్టుకు జుబీన్ గార్గ్ మృతికి సంబంధించి ప్రాథ‌మిక నివేదిక‌ను అంద‌జేశారు. త‌ను పూర్తిగా మ‌ద్యం మ‌త్తులో ఉన్నాడ‌ని తెలిపారు. లాజరస్ ద్వీపం సమీపంలోని పడవ నుండి దూకి గాయకుడు మునిగి పోయాడని చెప్పారు . జుబీన్ గార్గ్ మరణానికి సంబంధించి కలతపెట్టే వివరాలు వెలువడ్డాయి. ఈత కొట్టడానికి ముందు లైఫ్ వెస్ట్ ధరించడానికి నిరాకరించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. మరణించే సమయానికి 52 ఏళ్ల గాయకుడు, స్కూబా డైవింగ్ సంఘటనలో మరణించాడని మొదట్లో భావించారు, కానీ అధికారులు తరువాత నీటిలో మునిగి పోవడమే కారణమని నిర్ధారించారు.
అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డేవిడ్ లిమ్ మాట్లాడారు. జుబీన్ గార్గ్ పడవ నుండి దూకడానికి ముందు మద్యం సేవించాడని, లైఫ్ జాకెట్ ధరించమని నౌక కెప్టెన్ పదేపదే సూచనలను చేసినా ప‌ట్టించు కోలేద‌ని తెలిపాడు. స్నేహితులు అతన్ని పడవలోకి లాగారు, అక్కడ అతన్ని ఆసుపత్రికి తరలించే ముందు సీపీఆర్ కూడా చేశార‌ని, కానీ ఫ‌లితం లేకుండా పోయింద‌న్నారు.
The post ఆ స‌మ‌యంలో జుబీన్ గార్గ మ‌ద్యం మ‌త్తులో ఉన్నాడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సూర్య చంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్‌ బతికే ఉంటారుసూర్య చంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్‌ బతికే ఉంటారు

హైద‌రాబాద్ : లోకం ఉన్నంత దాకా ఎన్టీఆర్ బ‌తికే ఉంటార‌ని అన్నారు ఎమ్మెల్యే, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో

YS Sharmila: దొంగ ఓట్ల లెక్కలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి – వైఎస్ షర్మిలYS Sharmila: దొంగ ఓట్ల లెక్కలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి – వైఎస్ షర్మిల

  బీజేపీ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ చేపట్టింది. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను హస్తం నేతలు ట్రక్కులో ఢిల్లీకి పంపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్

MK Stalin: ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టుకు స్టాలిన్ పార్టీMK Stalin: ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టుకు స్టాలిన్ పార్టీ

    తమిళనాడులో ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) చేపట్టాలంటూ ఎన్నికల కమిషన్‌(ఈసీ) తీసుకు న్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అధికార డీఎంకే సోమవారం సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. ఈసీ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, ప్రజాస్వామ్య హక్కు