hyderabadupdates.com movies ఇదే ‘కపుల్’.. మళ్లీ వేలంటైన్స్ డేకి

ఇదే ‘కపుల్’.. మళ్లీ వేలంటైన్స్ డేకి

వేలంటైన్స్ డే వీకెండ్లో తెలుగులో మూడు పేరున్న చిత్రాలు రిలీజయ్యాయి. ఐతే అందులో ‘ఫంకీ’, ‘సీతాపయనం’ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన తెచ్చుకోలేకపోయాయి. కానీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే ప్రేమకథా చిత్రం మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. రెండేళ్లకు పైగా సినిమానే చేయని సంతోష్ శోభన్, తన తొలి చిత్రం ‘దేవకీ నందన వసుదేవ’తో షాక్ తిన్న మానస వారణాసి జంటగా తమిళ దర్శకుడైన అశ్విన్ చంద్రశేఖర్ తొలి ప్రయత్నంగా రూపొందించిన చిత్రమిది.

యువి క్రియేషన్స్ అధినేతలతో కలిసి ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు ఆ చిత్రానికి మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి. రెండు కోట్ల మేర గ్రాస్ కూడా కలెక్ట్ చేసింది శనివారం ఈ చిత్రం.

ఆదివారం జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని.. ఆసక్తికర ప్రకటన చేశారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీతో మళ్లీ తామే ఇంకో లవ్ స్టోరీ చేయబోతున్నామని.. వచ్చే వాలంటైన్స్ డేకే అది కూడా రిలీజవుతుందని ధీరజ్ తెలిపాడు. మామూలుగా సంక్రాంతి విషయంలో ఇలాంటి క్రేజ్ ఉంటుంది, ఇలా ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుంటారు. కానీ ధీరజ్ మాత్రం వేలంటైన్స్ డేకి ఇదే కాంబినేషన్లో సినిమా ఉంటుందని.. అది కూడా లవ్ స్టోరీనే అని చెప్పాడు.

ఐతే దర్శకుడు కూడా అశ్వినేనా కాదా అన్నది మాత్రం ధీరజ్ వెల్లడించాడు. యువి అధినేతలతో కలిసి ఈ చిత్రాన్ని తానే ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. ఐతే ఈలోపు సంతోష్ శోభన్, మానస వారణాసి కావాలంటే వేరే సినిమాలు చేసుకోవచ్చని.. కానీ వచ్చే ప్రేమికుల దినోత్సవానికి మాత్రం తమ కలయికలో సినిమా రిలీజవుతుందని చెప్పాడు.

Related Post

బాహుబలి ది ఎపిక్… మెప్పించిందా లేదాబాహుబలి ది ఎపిక్… మెప్పించిందా లేదా

టాలీవుడ్ హిస్టరీలో మొదటిసారి రెండు భాగాల సినిమాను ఒకే పార్ట్ గా విడుదల చేసిన రాజమౌళి పదేళ్ల తర్వాత కూడా జనాన్ని థియేటర్లకు పోటెత్తేలా చేయడం ఇండస్ట్రీ వర్గాలను నివ్వెరపరుస్తోంది. ముఖ్యంగా తెలుగు వర్షన్ రాబడుతున్న వసూళ్లు చూసి ట్రేడ్ కి

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది. ఇందులో ప్రధానంగా ఏ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, ఏ అంశాలపై అసంతృప్తిగా ఉన్నారు, ఏ

కల్తీ లడ్డు వివాదం: ప్రజలకు పిలుపునిచ్చిన పవన్కల్తీ లడ్డు వివాదం: ప్రజలకు పిలుపునిచ్చిన పవన్

మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. సిట్ నివేదికను వైసీపీ తప్పుదారి పట్టిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తోందని కూటమి