hyderabadupdates.com Gallery ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన చికిత్స అందించాలి

ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన చికిత్స అందించాలి

ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన చికిత్స అందించాలి post thumbnail image

ముంబై : పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కు బాస‌ట‌గా నిలిచారు త‌న కాలంలో ఆడిన 14 మంది అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు పొందిన మాజీ కెప్టెన్లు. ఈ మేర‌కు పాకిస్తాన్ ప్ర‌భుత్వానికి, ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ కు సుదీర్ఘ లేఖ రాశారు. జైలులో ఉన్న త‌మ స‌హ‌చ‌రుడు ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాల‌ని కోరారు. గ్రెగ్ చాపెల్ నేతృత్వంలోని ఈ పిటిషన్ ను ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కు అందజేశారు. దీనిపై సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అలన్ బోర్డర్, స్టీవ్ వా, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, కిమ్ హ్యూస్, మైక్ అథర్టన్, నాసర్ హుస్సేన్, మైక్ బ్రియర్లీ, డేవిడ్ గోవర్, క్లైవ్ లాయిడ్ , జాన్ రైట్ సంతకం చేశారు.
ప్రభుత్వం న్యాయమైన చికిత్స కోసం అభ్యర్థించారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ కు త‌న సార‌థ్యంలో 1992 ప్రపంచ కప్ విజేత‌గా నిలిచిన త‌న ప‌ట్ల క‌ర్క‌శ‌త్వం ప్ర‌ద‌ర్శించ రాద‌ని పేర్కొన్నారు. క‌స్ట‌డీలో ఉన్న త‌న ఆరోగ్యం రోజు రోజుకు ఇబ్బందిక‌రంగా మారింద‌న్నారు. తీవ్ర‌మైన దృష్టి స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయ‌ని వాపోయారు మాజీ కెప్టెన్లు. ఇమ్రాన్ ఖాన్ పట్ల మానవీయంగా వ్యవహరించాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి విన్న‌వించారు. తను ఆట‌కు చేసిన కృషిని విశ్వ వ్యాప్తంగా ఆరాధిస్తార‌ని తెలిపారు. నైపుణ్యం, స్థితిస్థాప‌క‌త‌, నాయ‌క‌త్వం, క్రీడా స్పూర్తిపై నిర్మించిన విజ‌యం స‌రిహ‌ద్దులు దాటి త‌రాల‌కు స్పూర్తిని ఇచ్చింద‌న్నారు.
The post ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన చికిత్స అందించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తాం – సీఎం చంద్రబాబుCM Chandrababu: విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తాం – సీఎం చంద్రబాబు

    ముంబయి తరహాలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్‌, టీసీఎస్‌ వంటి దిగ్గజ సంస్థల రాకతో విశాఖ నగరం ఐటీ హబ్‌ గా మారుతోందని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ కు చాలా చేసామని

TTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపుTTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు

  తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు కీలక మలుపు తిరిగింది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్నఅప్పన్న అరెస్టుతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు

100 రోజుల ప‌ని క‌ల్పించని కేంద్ర స‌ర్కార్100 రోజుల ప‌ని క‌ల్పించని కేంద్ర స‌ర్కార్

అమ‌రావ‌తి : మోదీ స‌ర్కార్ కార్పొరేట్ల‌కు వంతం పాడుతూ కీల‌క‌మైన జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కానికి తూట్లు పొడి చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(MGNREGA) పరిరక్షణ