hyderabadupdates.com Gallery ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా post thumbnail image

హైద‌రాబాద్ : స్మ‌గ్ల‌ర్ల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డి నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఇవాళ క‌న్నుమూశారు. ఆమె మృతి ప‌ట్ల తెలంగాణ ప్ర‌భుత్వం తీవ్ర సంతాపం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ఆదివారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు వెల్ల‌డించారు. ఆమె మృతి ప‌ట్ల తీవ్ర ఆవేద‌న చెందారు. ఇది జ‌ర‌గ కూడ‌ద‌ని పేర్కొన్నారు. దీనిని సీరియ‌స్ గా తీసుకుంటామ‌న్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. క్షేత్రస్థాయి విధుల్లో ఉన్న ఎక్సైజ్ సిబ్బంది భద్రత కోసం వారికి ఆయుధాలు అందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
నిజామాబాద్‌లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో సౌమ్య జనవరి 23న తీవ్రంగా గాయపడ్డారు. పారిపోయే ప్రయత్నంలో స్మగ్లర్లు కావాలనే తమ వాహనంతో త‌న‌ను ఢీకొట్టారు. నిజామాబాద్ జిల్లాలో విధి నిర్వహణలో ఉండగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న వ‌య‌సు 26 ఏళ్లు. వారి దాడి కార‌ణంగా త‌ను తీవ్రంగా గాయ‌ప‌డింది. త‌న‌ను హుటా హుటిన హైద‌రాబాద్ లోని నిమ్స్ కు త‌ర‌లించారు. కానీ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ లేదు. ఇవాళ సౌమ్య తుది శ్వాస విడిచారు. రాష్ట్రంలో గంజాయి స్మ‌గ్ల‌ర్లు పెద్ద ఎత్తున దందా నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొత్తం విలువైన ప్రాణం కోల్పోవ‌డం తెలంగాణ ప్రాంతానికి తీర‌ని న‌ష్టం అని పేర్కొంది స‌ర్కార్.
The post ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటనపోలవరం ప్రాజెక్ట్ లో పీపీఏ సిఈఓ పర్యటన

పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) యోగేష్ పైతాన్కర్ శనివారం సమీక్షించారు. ఢిల్లీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనుల సమీక్ష , పరిశీలనకు వచ్చిన ఆయన తొలుత పీ పీ

హైడ్రా ప‌నితీరుకు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ఫిదాహైడ్రా ప‌నితీరుకు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ఫిదా

హైద‌రాబాద్ : అంత‌రిక్ష ఆధారిత సాంకేతికతను వినియోగించి ప్రజా ఆస్తులతో పాటు సరస్సులను రక్షించేందుకు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ చేస్తున్న‌ కృషిని ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు అభినందించారు. ఎన్ ఆర్ ఎస్ సీ డైరెక్ట‌ర్ డా. ప్ర‌కాష్ చౌహాన్‌, ఇస్రో మాజీ

YS Jagan: వైఎస్‌ జగన్‌ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలుYS Jagan: వైఎస్‌ జగన్‌ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు

  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి వైఎస్‌ భారతి బాణాసంచా కాల్చారు. దీపావళి వేడుకలు సందర్భంగా వైఎస్‌ జగన్‌