hyderabadupdates.com Gallery ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్

ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్

ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్ post thumbnail image

శ్రీ‌లంక : టి 20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబో వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో అమెరికా జ‌ట్టుపై విజ‌యం సాధించింది పాకిస్తాన్. పాక్ జ‌ట్టుకు చెందిన ఫ‌ర్హాన్ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. బౌల‌ర్లు కూడా స్పిన్ మాయ‌జాలం చేయ‌డంతో పాక్ సునాయ‌సంగా గెలుపొందింది. ఈ రెండు జ‌ట్లు గ్రూప్ – ఎలో త‌ల‌ప‌డ్డాయి. ఫ‌ర్హాన్ 41 బంతులు ఎదుర్కొని 73 ర‌న్స్ చేశాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో పాకిస్తాన్ 9 వికెట్లు కోల్పోయి 190 ర‌న్స్ చేసింది. అబ్రార్ అహ్మ‌ద్ 30 ప‌రుగులు ఇచ్చి ఒక వికెట్ తీయ‌గా . షాదాబ్ ఖాన్ 26 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు, ఉస్మాన్ తారిక్ 27 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
న‌వాజ్ 21 ర‌న్స్ ఇచ్చి మ‌రో వికెట్ కూల్చాడు. అనంత‌రం 191 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగింది అమెరికా జ‌ట్టు. 8 వికెట్లు కోల్పోయి 158 ప‌రుగుల‌కే ప‌రిమితం అయ్యింది అమెరికా జ‌ట్టు. ఇదిలా ఉండ‌గా పాకిస్తాన్ టీమ్ కు ఇది రెండో విజ‌యం టోర్నీలో. ఇక అమెరికా జ‌ట్టు గెలుపు కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చింది. శుభ‌మ్ రంజానే దూకుడుగా ఆడాడు. త‌ను కేవ‌లం 30 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 51 ప‌రుగులు చేశాడు. ఓపెన‌ర్లు ష‌యాన్ జ‌హంగీర్ 34 బాల్స్ ఎదుర్కొని 49 ప‌రుగుల వ‌ద్ద వెనుదిరిగాడు. గౌస్ 13 బాల్స్ ఎదుర్కొని 13 ర‌న్స్ చేశాడు. చివ‌ర‌కు పాకిస్తాన్ బౌల‌ర్ల మాయాజాలానికి వికెట్లు పారేసుకున్నారు. దీంతో పాకిస్తాన్ గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది.
The post ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఇటీవ‌లే త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత పై ఆస‌క్తిక‌ర

హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌

హైద‌రాబాద్ : ద‌ర్శ‌క‌, నిర్మాత వేణు ఉడుగుల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. త‌ను ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆపై నిర్మాత‌గా స‌క్సెస్ అయ్యాడు. అష్ట క‌ష్టాలు ప‌డి, అప్పులు చేసిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా తీశాడు. తాజాగా

Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్‌ ! తొలిదశలో 65% ఓటింగ్ !Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్‌ ! తొలిదశలో 65% ఓటింగ్ !

    బిహార్‌ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో గురువారం పండగ వాతావరణంలో జరిగిన ఓటింగులో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్‌