hyderabadupdates.com Gallery ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు

ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు

ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు post thumbnail image

హైద‌రాబాద్ : సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జ‌రిగిన బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌రిహారం అంద‌జేశారు. ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చెక్కులను అందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందుకే అందర్నీ సచివాలయానికి పిలిచి పరిహారం అందించామని చెప్పారు. ఈ ప్ర‌భుత్వం మీది. ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అంద‌రికీ అండ‌గా ఉంటామని ముఖ్య‌మంత్రి బాధిత కుటుంబాల‌కు భ‌రోసా ఇచ్చారు. ప్ర‌మాదం జరిగినట్లు తెలుసుకున్న వెంట‌నే మంత్రి అజ‌హ‌రుద్దీన్ నేతృత్వంలోని ప్ర‌తినిధి బృందాన్ని మ‌దీనాకు పంపామ‌ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు.
చ‌నిపోయిన వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌క్ష‌ణ‌మే పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించి మ‌దీనా పంపించామ‌న్నారు. అక్క‌డి భార‌త్ కాన్సులేట్‌, సౌదీ ప్ర‌భుత్వంతో చ‌ర్చించి మృతి చెందిన వారి అంత్య‌క్రియ‌లు జ‌న్నుతుల్ బ‌ఖీలో చేయించిన విషయాలను గుర్తు చేశారు. నవంబర్ 17, 2025 న మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున, గాయపడిన ఒకరి కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారం అందించారు.
దేశం బ‌య‌ట జ‌రిగే ప్ర‌మాదాల్లో మృతిచెందిన వారికి ప్ర‌భుత్వాలు ప‌రిహారం చెల్లించే విధానం లేనప్పటికీ, ప్రభుత్వం మాన‌వ‌తా దృక్ప‌థంతో స‌హాయం అందించాలని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ముఖ్యమంత్రి చెప్పారు. ఇటీవ‌ల నాంప‌ల్లి అగ్నిప్ర‌మాదంలో మృతి చెందిన వారి కుటుంబాల‌కు ప‌రిహారం చెల్లించామ‌న్నారు. ముస్లిం సోద‌రుల‌తో త‌నకున్న‌ అనుబంధాన్ని ముఖ్య‌మంత్రి ఈ సంద‌ర్బంగా గుర్తు చేసుకున్నారు. తాను కొడంగ‌ల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన 2009 సంవ‌త్స‌రం నుంచి నియోజ‌క‌వ‌ర్గంలోని అయిదు మండ‌లాల నుంచి ఒకొక్క‌రి చొప్పున ఏటా అయిదుగురిని త‌న సొంత ఖ‌ర్చుల‌తో హ‌జ్ యాత్ర‌కు పంపుతున్నాన‌ని చెప్పారు. వారిని ఎంపిక చేసే బాధ్య‌త స్థానిక ముస్లిం మ‌త పెద్ద‌ల‌కే అప్ప‌జెప్పాన‌న్నారు.
The post ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌

  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం చూస్తే బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీజేపీకు డిపాజిట్‌ కూడా రాలేదని… ‘ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌’ సమీకరణం బాగానే పనిచేసిందని చెప్పారు. ఎన్నికలకు

నారావారి ప‌ల్లెలో చంద్ర‌బాబు ఫ్యామిలీ సంద‌డినారావారి ప‌ల్లెలో చంద్ర‌బాబు ఫ్యామిలీ సంద‌డి

చిత్తూరు జిల్లా : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు సంక్రాంతి పండుగ వేళ తీపి క‌బురు ల‌భించింది. ఆయ‌న‌పై మోపిన అభియోగం, ఏపీ స్కిల్ డెవ‌లప్మెంట్ స్కాం కేసులో గ‌తంలో 50 రోజుల పాటు జైలు జీవితం గ‌డిపారు. ఆ

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్స‌వాలుశ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్స‌వాలు

హైదరాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శాస్త్రోక్తంగా