hyderabadupdates.com Gallery ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవికి నామినేష‌న్

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవికి నామినేష‌న్

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవికి నామినేష‌న్ post thumbnail image

విజయవాడ: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) 2026-27 సీజన్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడలోని ఏసీఏ కార్యాలయంలో ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను క‌లిశారు. తన నామినేషన్ పత్రాలను అధికారికంగా అందజేశారు. గత సీజన్ (2025-26)లో సుజయ్ కృష్ణ రంగారావు నేతృత్వంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ అద్భుతంగా క్రీడాభిమానుల్ని ఆకట్టుకుంది. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించింది. క్రీడాకారుల ఎంపిక నుంచి టోర్నమెంట్ నిర్వహణ వరకు ఆయన చూపిన చొరవతో ఏపీఎల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆ అనుభవాన్ని, విజయ పరంపరను కొనసాగించాలనే సంకల్పంతో ఈ ఏడాది కూడా ఆయన చైర్మన్ పదవికి పోటీ చేస్తున్నారు.
ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియను ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. రాష్ట్రంలోని క్రికెట్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, గ్రామీణ స్థాయి ప్రతిభను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సుజయ్ కృష్ణ రంగారావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ స‌ర్కార్ సైతం త‌న‌ను ప్రోత్స‌హిస్తుండ‌డంతో ఇక ఈ ఎన్నిక కేవ‌లం లాంఛ‌న‌ప్రాయం కానుంది. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ కు అధ్యక్షుడిగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. ఇప్ప‌టికే బీసీసీఐతో స‌త్ సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. క్రికెట్ పై ఫోక‌స్ ఉండాల‌ని సూచించారు మంత్రి నారా లోకేష్‌.
The post ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవికి నామినేష‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Rabri Devi: కుమారుల పోటీపై రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలుRabri Devi: కుమారుల పోటీపై రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

Rabri Devi : బీహార్‌లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఇంతలో ఆర్జేడీ చీఫ్‌ లాలూ భార్య రబ్రీదేవి (Rabri Devi) తన కుమారుల పోటీపై వ్యాఖ్యానించారు. తన కుమారుడు, జనశక్తి జనతాదళ్ (జేజేడీ)అధినేత తేజ్ ప్రతాప్

న‌టి ప్ర‌త్యూష కేసులో అన్యాయం జ‌రిగిందిన‌టి ప్ర‌త్యూష కేసులో అన్యాయం జ‌రిగింది

హైద‌రాబాద్ : 24 ఏళ్ల త‌ర్వాత భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టి ప్ర‌త్యూష కేసుపై. మంగ‌ళ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌త్యూష కేసులో కీల‌క నిందితుడిగా ఉంటూ బెయిల్