hyderabadupdates.com movies ఏపీలో ఇకపై టికెట్ రేట్లు అలా పెంచరు

ఏపీలో ఇకపై టికెట్ రేట్లు అలా పెంచరు

టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు ముందు టికెట్ రేట్లు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా చిత్రాల నిర్మాతలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం, వారం లేదా పది రోజులపాటు స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వాలు ఆమోద ముద్ర వేయడం పరిపాటి. అయితే, ఈ రకంగా సినిమా టికెట్ల రేట్లు పెంచడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

ఇటీవల అఖండ-2 చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచినా సరే కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే అటువంటివి జరగకుండా ఏపీలో సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం సరికొత్త విధానాన్ని రూపొందించబోతున్నామని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

ప్రతిసారి సినిమా బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంచుతున్నామని ఆయన అన్నారు. కానీ, ఇకనుంచి ఇందుకోసం ఒక నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించబోతున్నామని చెప్పారు. సినిమా టికెట్ల రేట్లపై నూతన విధానం కోసం ఏర్పాటైన కమిటీతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై సంబంధిత అధికారులతో దుర్గేష్ చర్చించారు. ఆల్రెడీ అమల్లో ఉన్న జీవోతోపాటు సినిమా బడ్జెట్ ప్రకారం సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటూ వస్తున్నామని, భవిష్యత్తులో ఒక నూతన విధానాన్ని రూపొందించాలని నిర్ణయించామని చెప్పారు.

కేటగిరీల ప్రకారం సమానంగా టికెట్ రేట్లు పెంచే విధానాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే, లో బడ్జెట్, హై బడ్జెట్ చిత్రాల టికెట్ రేట్లు ఎంత పెంచాలి అనే విషయంపై కమిటీ చర్చించి సరైన తీసుకుంటుందని తెలిపారు. అంతేకాదు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను, సలహాలను కూడా పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు. ఇటు, నిర్మాతలకు, అటు ప్రేక్షకులకు భారం కాకుండా సినీ పరిశ్రమకు, ప్రజలకు మేలు కలిగేలా నూతన విధానాన్ని రూపొందిస్తామన్నారు.

ఐ బొమ్మ రవి అరెస్ట్ నేపథ్యంలో సినిమా టికెట్ల పెంపు వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చినా కొందరు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు కోర్టులను ఆశ్రయించడంతో చివరి నిమిషంలో చిత్ర బృందానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే పాత విధానాలకు స్వస్తి పలికి సరికొత్త విధానాన్ని రూపొందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Related Post

అఫీషియల్… అఖండ 2కి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్అఫీషియల్… అఖండ 2కి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

అనుకున్నట్టే అఖండ 2 తాండవం టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ముందు రోజు డిసెంబర్ 4 వేయబోయే ప్రీమియర్లకు 600 రూపాయలు ఫ్లాట్ టికెట్ రేట్ నిర్ణయించారు. డిసెంబర్ అయిదు నుంచి పది రోజుల

Mirage OTT Release: When and where to watch Asif Ali, Aparna Balamurali’s crime thriller onlineMirage OTT Release: When and where to watch Asif Ali, Aparna Balamurali’s crime thriller online

Mirage is a crime thriller that follows Abhirami, a young woman thrown into turmoil when her fiancé, Kiran, mysteriously disappears. Before vanishing, Kiran had been involved with a financial consultancy