hyderabadupdates.com Gallery ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ బాట

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ బాట

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ బాట post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్నారు. ఇవాళ స‌చివాల‌యంలో కీల‌క మంత్రివ‌ర్గం స‌మావేశం నిర్వ‌హించారు. త‌న అధ్యక్ష‌త‌న జ‌రిగిన ఈ కీల‌క భేటీలో ప‌లు ప్ర‌ధాన అంశాల‌పై చ‌ర్చించారు. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌తో పాటు మంత్రులు బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి, ప‌య్యావుల కేశ‌వ్, కింజ‌రాపు అచ్చెన్నాయుడు, వంగ‌ల‌పూడి అనిత‌, గొట్టిపాటి ర‌వికుమార్, కొలుసు పార్థ‌సార‌థి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్ , నాదెండ్ల మ‌నోహ‌ర్, కందుల దుర్గేష్, ఎస్. స‌విత‌, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. సీఎస్ ఆదిత్యానాథ్ తో పాటు ఆయా శాఖ‌ల‌కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంత‌రం చంద్ర‌బాబు నాయుడు హుటా హుటిన దేశ రాజ‌ధాని ఢిల్లీకి ప్ర‌యాణం అయ్యారు.
ఆయ‌న ఇవాళ రాత్రి హ‌స్తిన‌లో మ‌కాం చేస్తారు. రేపు మంగ‌ళ‌వారం కేంద్ర మంత్రుల‌ను క‌లుస్తారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇక నిర్దేశించిన‌ షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ , కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సహా ఐదుగురు కేంద్ర మంత్రులను కలుస్తారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, నిధుల విడుదలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి సాయంత్రం 5 గంటలకు అమరావతికి తిరిగి వస్తారు.
The post ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ బాట appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలుChevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు

  వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

NDA Alliance: బిహార్ ఎన్డీయే కుదిరిన సీట్ల సర్దుబాటుNDA Alliance: బిహార్ ఎన్డీయే కుదిరిన సీట్ల సర్దుబాటు

    బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రమంత్రి చిరాగ్‌

అట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డిఅట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి

అమరావతి : కోనసీమలో అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి, వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని, ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా, అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత ,