న్యూఢిల్లీ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ హీరో కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నమాన్ అవార్డుల ప్రదానోత్సం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత జట్టు తరపున హాజరయ్యాడు సంజు శాంసన్. ఈ సందర్బంగా ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే తో చిట్ చాట్ చేశాడు . అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం కూల్ గా ఇచ్చాడు శాంసన్. ఈనెల 28 నుంచి ప్రారంభం అయ్యే ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఈ ఏడాది తను రాజస్తాన్ రాయల్స్ జట్టు తరపు నుంచి కాకుండా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడనున్నాడు.
తనను తాను మరోసారి నిరూపించు కునేందుకు ఐపీఎల్ దోహద పడుతుందని భావిస్తున్నట్లు చెప్పాడు సంజు శాంసన్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదన్నాడు. ఈసారి నా పాత్ర చాలా సులభంగా ఉండ బోతోందని తాను భావిస్తున్నానని చెప్పాడు సంజు శాంసన్. కేవలం మైదానంలోకి వెళ్లడం, బ్యాటింగ్ చేయడం, అంతటా పరుగెత్తడం, క్రికెట్ ఆటను ఆస్వాదించడం మాత్రమే మిగిలి ఉందన్నాడు.కాబట్టి ఈసారి అంతా చాలా సులభంగా ఉందన్నాడు. ప్రత్యర్థుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా, నా బాధ్యతగా నేను చేయాల్సిన పనిని మాత్రమే చేస్తానని ప్రకటించాడు సంజు శాంసన్.
యువ ఆటగాడు ఆయుష్ మాత్రేతో మీరు ఎలాంటి సంభాషణలు జరుపుతారు? మరికొన్ని వారాల్లో మీరిద్దరూ కలిసి ఆడబోతున్నారు కదా? అన్న ప్రశ్నకు కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు. ఈ రోజుల్లో, వారికి ఏం చేయాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తోందని చెప్పాడు.
The post ఐపీఎల్ లో ప్రత్యర్థుల గురించి పట్టించుకోను appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఐపీఎల్ లో ప్రత్యర్థుల గురించి పట్టించుకోను
Categories: