hyderabadupdates.com Gallery ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం

ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం

ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం post thumbnail image

ముంబై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను గెలుచుకున్న అనంత‌రం జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ త‌న స్వంత స్థ‌లం ముంబైకి చేరుకున్నాడు. ఈ సంద‌ర్బంగా గ్రాండ్ వెల్ కం ల‌భించింది. రాష్ట్ర స‌ర్కార్ త‌ర‌పున త‌న‌కు ఘ‌నంగా స‌న్మానం చేశారు. కెప్టెన్ మీడియాతో మాట్లాడాడు. ఇది స‌మిష్టి విజ‌యం అని పేర్కొన్నాడు. ఇంత కాలం టోర్నీపై ఫోక‌స్ పెట్టామ‌ని, కుటుంబాల‌కు దూరంగా ఉన్నామ‌ని తెలిపాడు. వరుసగా ట్రోఫీలు గెలవడం నాకు చాలా సంతోషంగా ఉంద‌న్నారు సూర్య కుమార్ యాద‌వ్. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, 2026లో మన గడ్డపై ట్రోఫీ గెలిస్తే చాలా బాగుంటుందని అనుకున్నాం అని తెలిపాడు.
పొట్టి ఫార్మాట్ లో ఎవ‌రూ ఊహించ లేదు తాము గెలుస్తామ‌ని అని అన్నాడు. కానీ త‌మ జ‌ట్టు అన్ని రంగాల‌లో డామినేట్ చేస్తూ వ‌చ్చింద‌న్నాడు. జ‌ట్టు ప‌రంగా ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంతు స‌హ‌కారం అందించార‌ని చెప్పాడు. ఇదే స‌మ‌యంలో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నాడు. త‌ను క‌మ్ బ్యాక్ అయిన విధానం సూప‌ర్ అని పేర్కొన్నాడు. విండీస్, ఇంగ్లండ్, ఫైన‌ల్ లో న్యూజిలాండ్ తో త‌ను అద్బుతంగా ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడ‌ని, త‌న‌తో పాటు బుమ్రా కీల‌క‌మైన భూమిక పోషించాడ‌ని ప్ర‌శంసించాడు సూర్య కుమార్ యాద‌వ్.
త‌మ‌మ‌ తదుపరి లక్ష్యం ఒలింపిక్స్‌లో భారతదేశం తరఫున స్వర్ణం గెలవడం మాత్ర‌మే మిగిలి ఉంద‌న్నాడు . భారత క్రికెట్ జట్టు మంచి జోరులో ఉందని, భవిష్యత్తులో భారతదేశం తరఫున మరిన్ని ట్రోఫీలు గెలవడానికి ప్రయత్నిస్తాన‌ని చెప్పాడు కెప్టెన్.
The post ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ అరుదైన రికార్డ్ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ అరుదైన రికార్డ్

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ విద్యుత్ బ‌స్సుల త‌యారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ అరుదైన రికార్డును న‌మోదు చేసింది. ఈ ఏడాది ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి 3వ త్రైమాసికంలో ఏకంగా 385 ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేసింది. వాటిని డెలివ‌రీ

Mumbai Hostage: పిల్లల నిర్బంధం ఘటనపై మరాఠీ నటి సంచలన పోస్ట్‌Mumbai Hostage: పిల్లల నిర్బంధం ఘటనపై మరాఠీ నటి సంచలన పోస్ట్‌

Mumbai Hostage : మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని (Mumbai) ఓ యాక్టింగ్‌ స్టూడియోలో పట్టపగలే చిన్నారులను నిర్బంధించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై తాజాగా మరాఠీ నటి రుచితా విజయ్‌ జాదవ్‌ స్పందిస్తూ సంచలన విషయాలు