హైదరాబాద్ : ప్రముఖ విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ అరుదైన రికార్డును నమోదు చేసింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3వ త్రైమాసికంలో ఏకంగా 385 ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసింది. వాటిని డెలివరీ చేసినట్లు సంస్థ ప్రతినిధి మోహన్ బాబు వెల్లడించారు. దీని కారణంగా మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ 663.60 కోట్లకు చేరుకుందన్నారు. వార్షికంగా 29 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. అదే సమయంలో వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయం రూ 97.10 కోట్లుగా నమోదై ఉందన్నారు. గత ఏడాదితో పోలిస్తే 19 శాతం వృద్ధిని సాధించిందన్నారు. మెరుగైన ఆపరేషనల్ సామర్థ్యం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఈ త్రైమాసికంలో పన్నుల ముందు లాభం రూ 64.07 కోట్లుగా ఉండగా, నికర లాభం రూ 46.68 కోట్లుగా నమోదైందని తెలిపారు. ఒక్కో షేర్కు లాభం రూ 5.65 ఓలెక్ట్రా ప్రకటించినట్లు తెలిపారు.
ఈ త్రైమాసికంలో డెలివరీ చేసిన 385 ఎలక్ట్రిక్ వాహనాల్లో 24 ఎలక్ట్రిక్ టిప్పర్లు కూడా ఉండటం విశేషం. ఇది ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ఎలక్ట్రిక్ టిప్పర్ల విభాగంలోనూ ఒలెక్ట్రా తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్నదని సూచిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 3,639 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసిన సంస్థ, ప్రస్తుతం 9,439 ఎలక్ట్రిక్ వాహనాల బలమైన ఆర్డర్ బుక్తో రాబోయే త్రైమాసికాలకు గట్టి ఆదాయ అవకాశాలను కలిగి ఉంది. గడచిన తొమ్మిది నెలల కాలానికి సంబంధించి ఒలెక్ట్రా గ్రీన్టెక్ స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది.
ఈ సమయంలో ఆదాయం రూ 1,667.45 కోట్లు నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 23 శాతం పెరిగింది. వడ్డీ, పన్నులు, తరుగుదల , రుణ విమోచనకు ముందు ఆదాయంరూ 246.08 కోట్లకు చేరుకొని 13 శాతం వృద్ధిని సాధించింది. పన్నుల ముందు లాభం రూ 166.33 కోట్లుగా ఉండగా, నికర లాభంరూ 122.14 కోట్లుగా నమోదై గత ఏడాదితో పోలిస్తే స్థిరమైన వృద్ధిని చూపించింది. కార్యనిర్వహణ సామర్థ్యం, క్రమబద్ధమైన అమలుపై నిరంతర దృష్టి పెట్టడం వల్లే ఆదాయం, లాభాల్లో ఈ స్థాయి వృద్ధిని సాధించగలిగామని సంస్థ ఎండీ మహేష్ బాబు పేర్కొన్నారు.
The post ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ అరుదైన రికార్డ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ అరుదైన రికార్డ్
Categories: