hyderabadupdates.com Gallery ఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండి

ఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండి

ఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండి post thumbnail image

ఢిల్లీ :కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి సుదీర్ఘ లేఖ రాశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డికి. కోట భూముల నుండి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల‌ని కోరారు. వాటిని తిరిగి ఏఎస్ఐకి అప్ప‌గించాల‌ని సూచించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాగా స్వాధీనం చేసుకున్న‌ ఆ భూములను ఏఎస్‌ఐ ఆస్తిగా స్పష్టంగా గుర్తించేలా రెవెన్యూ రికార్డులను సరి చేయడానికి అవసరమైన చర్యలు చేప‌ట్టాల‌ని సూచించారు. దాదాపు 250 సంవత్సరాల పాటు కాకతీయ రాజవంశానికి రాజధానిగా ఓరుగ‌ల్లు (వ‌రంగ‌ల్) పని చేసిందని అన్నారు. ఇది తన అద్భుతమైన చారిత్రక వారసత్వం, గొప్ప సాంస్కృతిక సంపదకు ప్రసిద్ధి చెందిందని చెప్పారు గంగాపురం కిష‌న్ రెడ్డి.
కాకతీయ కాలంలో రాజధానిని దండయాత్రల నుండి రక్షించడానికి ఏడు కోట గోడలతో వరంగల్ కోటను ప్రణాళికా బద్ధంగా నిర్మించారని వెల్ల‌డించారు. ఈ కోట ఢిల్లీ సుల్తానులు హైదరాబాద్ నిజాంల దాడులను తట్టుకుని, కాకతీయ పాలకుల శౌర్యం, బలానికి ప్రతీకగా నిలుస్తూనే ఉందన్నారు. అంతే కాకుండా ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు వరంగల్ కోట వాస్తు శిల్పం, శిల్పాలు, దేవాలయాలు , చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసు కోవడానికి సందర్శిస్తార‌ని చెప్పారు. పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కోటలో సౌండ్ అండ్ ఇల్యూమినేషన్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింద‌న్నారు గంగాపురం కిష‌న్ రెడ్డి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) పరిధిలోని రక్షిత స్మారక చిహ్నమైన వరంగల్ కోట రక్షణ , పునరుద్ధరణ కోసం నిరంతరం చర్యలు తీసుకుంటోంద‌న్నారు.
The post ఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కొత్త రాజ‌ధాని తీర్మానం స‌రే కేంద్రం నిధుల మాటేంటి..?కొత్త రాజ‌ధాని తీర్మానం స‌రే కేంద్రం నిధుల మాటేంటి..?

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ప్ర‌శంస‌లు కురిపించారు ఏపీ కూట‌మి స‌ర్కార్ పై. శ‌నివారం అమ‌రావ‌తి రాజ‌ధానిగా చేయాల‌ని కోరుతూ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో శాస‌న స‌భ‌లో తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. దీనికి ఆమోదం

మాయ‌మైన చెరువుల జాడ‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఆరామాయ‌మైన చెరువుల జాడ‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఆరా

హైద‌రాబాద్ : ప్ర‌జావాణి ఫిర్యాదుల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు. ముందుగా బంజారాహిల్స్ రోడ్డు నంబ‌రు 01లోని తాజ్ బంజారా లేక్‌ను ప‌రిశీలించారు. అనంత‌రం శంషాబాద్ మండ‌లం మామిడిప‌ల్లిలోని చెరువులు, వ‌ర‌ద కాలువ‌ల ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఆరా తీశారు .

సింగ‌రేణి స్కాంపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలిసింగ‌రేణి స్కాంపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలి

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్ర‌భుత్వంపై భ‌గ్గుమ‌న్నారు. రాష్ట్రానికి ఆత్మ‌గా ఉన్న సింగ‌రేణి బొగ్గు గ‌నులకు సంబంధించి చోటు చేసుకున్న స్కాంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు.