hyderabadupdates.com Gallery కాంట్రాక్టుల కోస‌మే బీజేపీలో చేరిన సీఎం రమేష్

కాంట్రాక్టుల కోస‌మే బీజేపీలో చేరిన సీఎం రమేష్

న్యూఢిల్లీ : పార్ల‌మెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను ఏకి పారేశారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం అమ‌రావ‌తిని రాజ‌ధాని చేస్తున్నారో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సీఎం రమేష్ బీజేపీ తరుపున రాజధాని కోసం మాట్లాడడం లేదన్నారు. ఆయ‌న కేవ‌లం త‌న‌కు రావాల్సిన , రాబోయే కాంట్రాక్టుల కోసం మాత్ర‌మే ఉన్నాడ‌ని ఎద్దేవా చేశారు. ఏనాడైనా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి ప్ర‌స్తావించాడా అని నిల‌దీశారు మిథున్ రెడ్డి. ఏపీ కూటమి స‌ర్కార్ కొలువు తీరిన ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చేశార‌ని ఆరోపించారు. ఇందు కోస‌మేనా మీకు మెజారిటీ క‌ట్ట‌బెట్టింది అని ఫైర్ అయ్యారు. బాధ్య‌త క‌లిగిన ప్ర‌భుత్వం అత్యంత బాధ్య‌తా రాహిత్యంతో పాల‌న‌ను కొన‌సాగిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.
కేవ‌లం వ్యాపార‌, వాణిజ్య ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకే , త‌మ వారి భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చేందుకే , త‌మ వారికి క‌ట్ట‌బెట్టేందుకే, ల‌బ్ది చేకూర్చేందుకే చంద్ర‌బాబు నాయుడు ప‌దే ప‌దే అమ‌రావ‌తి రాజ‌ధాని అంటున్నాడ‌ని ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి. రెండేళ్లలోనే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశార‌ని , కేవలం త‌మ సామాజిక వ‌ర్గానికి ప్ర‌యోజ‌నం చేకూర్చేలా నిర్ణ‌యాలు తీసుకున్నారంటూ ఆరోపించారు . ఢిల్లీలో చదరపు గజానికి 4,000 ఖర్చుపెడుతున్నారని, మ‌రో వైపు అమరావతిలో చదరపు గజానికి 12,000 రూపాయలకు పైగా ఖర్చు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. అద‌నంగా ఖ‌ర్చు చేస్తున్న రూ. 8 వేలు ఎవ‌రి జేబుల్లోకి వెళుతున్నాయో చెప్పాల‌ని నిల‌దీశారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
The post కాంట్రాక్టుల కోస‌మే బీజేపీలో చేరిన సీఎం రమేష్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తివినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి

హైద‌రాబాద్ : కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో పాటు అందాల ముద్దుగుమ్మ‌లు ఆషికా రంగ‌నాథ్, డింపుల్ హ‌య‌తి, సునీల్ , స‌త్య‌, వెన్నెల కిషోర్

ఐపీఎల్ మ‌హా సంగ్రామం పోరాటానికి సిద్దంఐపీఎల్ మ‌హా సంగ్రామం పోరాటానికి సిద్దం

బెంగ‌ళూరు : ఐపీఎల్ 2026 మ‌హా సంగ్రామం మార్చి 28న శ‌నివారం బెంగళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తో త‌ల‌ప‌డ‌నుంది స‌న్ రైజ‌ర్స్ ఆఫ్ హైద‌రాబాద్. ఇరు జ‌ట్లు ఇటు

జ‌స్ప్రీత్ బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్జ‌స్ప్రీత్ బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్

అహ్మ‌దాబాద్ : సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. ప్ర‌త్య‌ర్థి న్యూజిలాండ్ ను అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోదీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఫైన‌ల్ లో 96 ప‌రుగుల భారీ తేడాతో మ‌ట్టి