hyderabadupdates.com Gallery కీల‌క మ్యాచ్ ల‌కు వేదిక కానున్న కోల్ క‌తా

కీల‌క మ్యాచ్ ల‌కు వేదిక కానున్న కోల్ క‌తా

కీల‌క మ్యాచ్ ల‌కు వేదిక కానున్న కోల్ క‌తా post thumbnail image

కోల్ క‌తా : ఐసీసీ టోర్నీలో భాగంగా కీల‌క‌మైన మ్యాచ్ లు కొన‌సాగుతున్నాయి. దాయాది పాకిస్తాన్ జ‌ట్టు ఒక‌వేళ సెమీ ఫైన‌ల్ లేదా ఫైన‌ల్ కు చేరుకుంటే క‌చ్చితంగా ఇండియాలోని కోల్ క‌తా, అహ్మదాబాద్ లో ఆడాల్సి ఉంటుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎలా స్పందిస్తుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇదిలా ఉండ‌గా ఆయా మ్యాచ్ ల‌కు సంబంధించి బీసీసీఐ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. మంగ‌ళ వారం నుంచి టికెట్లు కూడా పెద్ద ఎత్తున అమ్మ‌కానికి వ‌చ్చాయి. లా అండ్ ఆర్డ‌ర్ దృష్ట్యా ఒక‌వేళ పాకిస్తాన్ గ‌నుక ఇండియాలో ప‌ర్య‌టించ‌క పోతే లేదా ఆడ‌క పోతే , నిరాక‌రిస్తే గ‌నుక అమ్ముడు పోయిన టికెట్ల స్థానంలో తిరిగి డ‌బ్బులు క్రికెట్ ఫ్యాన్స్ కు అంద‌జేస్తామ‌ని బీసీసీఐ ప్ర‌కటించింది.
శ్రీలంక అర్హత సాధించి భారతదేశం కాకుండా మరే ఇతర జట్టుతో సెమీఫైనల్ ఆడితే కూడా తిరిగి చెల్లింపు ఉంటుందని స్ప‌ష్టం చేసింది ఐసీసీ. ఇదిలా ఉండ‌గా ఐసీసీ టి20 మెగా టోర్నీ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. వ‌చ్చే మార్చి 4వ తేదీన తొలి సెమీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 5వ తేదీన రెండ‌వ సెమీ ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. ఇక మొత్తంగా ఈ రెండింటిలో గెలుపొందిన జ‌ట్లు నేరుగా ఫైన‌ల్ కు అర్హ‌త సాధిస్తాయి. మార్చి 8వ తేదీన గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లోని మోదీ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది.
The post కీల‌క మ్యాచ్ ల‌కు వేదిక కానున్న కోల్ క‌తా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులువ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు

ములుగు జిల్లా : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వెలుగొందుతున్న శ్రీ సమ్మక్క సారమ్మ మేడారం జాతరకు భ‌క్తులు పోటెత్తారు. ఆ ప్రాంగ‌ణ‌మంతా స‌ముద్రాన్నిత‌ల‌పింప చేస్తోంది. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండ‌గా గురువారం కేంద్ర గనుల శాఖ

KTR: కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదుKTR: కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదు

KTR : కాంగ్రెస్‌ పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సోమవారం బీఆర్కే భవన్‌ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పలు అంశాలని ప్రస్తావించారు కేటీఆర్ (KTR).