hyderabadupdates.com Gallery కుకు టీవీలో ఎంఎస్ ధోనీ పెట్టుబ‌డి

కుకు టీవీలో ఎంఎస్ ధోనీ పెట్టుబ‌డి

కుకు టీవీలో ఎంఎస్ ధోనీ పెట్టుబ‌డి post thumbnail image

చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ అద్భుత‌మైన క్రికెట‌ర్ గా గుర్తింపు పొందాడు. ఇదే స‌మ‌యంలో త‌ను మంచి వ్యాపార‌వేత్త కూడా. సంవ‌త్స‌రానికి భారీ ఎత్తున ఆదాయం పొందుతున్నాడు. టాప్ కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా, ప్ర‌మోట‌ర్ గా, ఇన్వెస్ట‌ర్ గా త‌ను పేరు పొందాడు. తాజాగా ఏఐ-ఆధారిత స్టోరీటెల్లింగ్ ప్లాట్‌ఫామ్ కుకు టీవీలో ఎంఎస్ ధోని పెట్టుబడిదారుగా చేరారు. ఈసంద‌ర్భంగా కుకు టీవీ కో ఫౌండ‌ర్ వినోద్ కుమార్ మీనా ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. దేశ వ్యాప్తంగా అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ప్ర‌ముఖుల‌లో ధోనీ ఒక‌రు అని పేర్కొన్నారు. ఆయ‌న త‌మ సంస్థ‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం త‌మ‌కు ఎంతో గ‌ర్వ కార‌ణంగా ఉంద‌న్నాడు.
ఇదిలా ఉండ‌గా భారత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని కుకు టీవీలో పెట్టుబడి పెట్టడమే కాకుండా, దాని షార్ట్స్ , డ్రామా యాప్ అయిన కుకు టీవీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేరారు. ఈ భాగస్వామ్యంపై ధోని స్పందించాడు. నేను కుకు టీవీలో పెట్టుబడి పెట్టడానికి ,టీవీకి అంబాసిడర్‌గా చేరడానికి ఎంచుకున్నాను, ఎందుకంటే ఈ ప్లాట్‌ఫామ్ నన్ను నిజంగా ఆకట్టుకుంది. ఇది భారతదేశం అంతటా ప్రేక్షకులకు బహుళ భాషలు , ఫార్మాట్‌లలో విభిన్నమైన వినోద అనుభవాన్ని అందించింది. దీని వృద్ధి అద్భుతంగా ఉంది, నా లాంటి చిన్న పట్టణాల నుండి వచ్చి ఇంతటి స్థాయిలో ఒక సంస్థను నిర్మించిన వ్యవస్థాపకులతో నేను బలంగా మమేకమవుతానని ప్ర‌క‌టించాడు.
The post కుకు టీవీలో ఎంఎస్ ధోనీ పెట్టుబ‌డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోని నేత‌లు అక్క‌ర్లేదు : సీఎంకార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోని నేత‌లు అక్క‌ర్లేదు : సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా పార్టీ జాతీయ అధ్య‌క్షుడైన బాబు జెండాను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

AP Government: రైడెన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కు రూ.22 వేల కోట్ల ప్రోత్సాహకాలుAP Government: రైడెన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కు రూ.22 వేల కోట్ల ప్రోత్సాహకాలు

AP Government : విశాఖలో రూ.87,520 కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటుచేయనున్న రైడెన్‌ ఇన్ఫోటెడ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు టైలర్‌మేడ్‌ విధానంలో ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు, లీజు, విద్యుత్, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల మినహాయింపుతో కలిపి గరిష్ఠంగా రూ. 22,002

Minister Nara Lokesh: రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు – మంత్రి నారా లోకేష్Minister Nara Lokesh: రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు – మంత్రి నారా లోకేష్

    విశాఖపట్నంలో ఈ నెల 14,15 తేదీల్లో పార్టనర్ షిప్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోన్నామని… ఈ సదస్సులో పెద్దఎత్తున పెట్టుబడి చర్చలు జరుగుతాయని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పారిశ్రామికవేత్తలతో పాటు పాలసీ మేకర్లు హాజరై రాబోయే