hyderabadupdates.com Gallery కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖ

కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖ

కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖ post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల కేంద్ర స‌ర్కార్ వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు బహిరంగ లేఖ రాశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. రాష్ట్రానికి సంబంధించి ఇద్ద‌రు కేబినెట్ లో ఉన్నా ఉప‌యోగం లేకుండా పోయింద‌న్నారు. ఇదేనా మీ చిత్తశుద్ది అని ప్ర‌శ్నించారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్.
కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్రం దయ కాదన‌ని, తెలంగాణ హక్కు అని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ప్రజలు పన్న‌లు చెల్లిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని నిల‌దీశారు. పార్లమెంట్ లో జరుగుతున్న కేంద్ర బడ్జెట్ చర్చ లో తెలంగాణ కి సంబంధించిన రావాల్సిన నిధులు ,పెండింగ్ ప్రాజెక్ట్ లు పై కేంద్ర మంత్రులు ఎందుకు చ‌ర్చించ‌డం లేద‌ని ఫైర్ అయ్యారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తున్నారని, కానీ తెలంగాణ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి పూర్తిగా నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
ఎన్నికలు, రాజకీయాలు వేరు అని, రాష్ట్ర అభివృద్ధి పై వివక్ష వద్దన్నారు. మంత్రులు కేంద్రంతో కొట్లాడి నిధులు సాధించాల‌ని హిత‌వు ప‌లికారు. లేకపోతే కిష‌న్ రెడ్డిని, బండి సంజ‌య్ ల‌ను ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని హెచ్చ‌రించారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్.
The post కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పలమనేరు గోశాలపై ప్రత్యేక దృష్టి సారించాలిపలమనేరు గోశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

తిరుపతి : టిటిడి ఆధ్వర్యంలో పలమనేరులో నిర్వహిస్తున్న గోశాలలో పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ తెలిపారు. ఆయన పలమనేరు గోశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ

TTD: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో మృతిని హత్యగా నిర్ధరిస్తూ కేసుTTD: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో మృతిని హత్యగా నిర్ధరిస్తూ కేసు

    పరకామణిలో డాలర్ల చోరీ కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ మృతిని హత్యగా నిర్ధారిస్తూ అనంతపురం గుత్తి జీఆర్‌పీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు ఫైల్‌

ఔను వాళ్లిద్దరు ఇష్ట‌ప‌డ్డారుఔను వాళ్లిద్దరు ఇష్ట‌ప‌డ్డారు

చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ సంచ‌ల‌నంగా మారాడు. త్వ‌ర‌లోనే త‌మిళ‌నాడు రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. త‌న‌కు లెక్క‌కు మించిన ఆస్తులు ఉన్నాయి. మ‌రో వైపు త‌న‌కు త‌న భ‌ర్త విజ‌య్ నుండి