ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠను రేపింది ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ కు జరిగిన మున్సిపల్ ఎన్నిక. చివరకు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. కానీ భారతీయ జనతా పార్టీ ఈ కీలక పదవిని కైవసం చేసుకోవడం విశేషం. విచిత్రం ఏమిటంటే భారత రాష్ట్ర సమితి పార్టీ అనూహ్యంగా బీజేపీకి మద్దతు తెలిపింది. రాజకీయ వర్గాలను విస్తు పోయేలా చేసింది. గులాబీ పార్టీ ఇచ్చిన సపోర్ట్ తో చైర్పర్సన్గా ఎన్నికయ్యారు బీజేపీకి చెందిన అంకం మౌనిక. వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు.
దీంతో ఆదివారం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ ఈ పదవిని దక్కించు కోవడం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసేలా చేసింది. చైర్ పర్సన్ పదవికి సంబంధించి తమ పార్టీకి చెందిన మహిళకు మద్దతు గనుక ఇస్తే తాము వైస్ చైర్మన్ పదవికి బేషరతుగా సపోర్ట్ చేస్తామంటూ బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ కమలం ప్రతిపాదనకు గులాబీ ఓకే చెప్పింది.
12 మంది సభ్యులు కలిగిన ఈ మున్సిపల్ కౌన్సిల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించ లేదు. బీఆర్ఎస్ , బీజేపీ చెరో నాలుగు స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ మూడు స్థానాలు, ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి మద్దతు, ఒక ఎక్స్-అఫిషియో ఓటుతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరింది. అయితే బీఆర్ఎస్ తన మద్దతును బీజేపీకి ప్రకటించడంతో, రాజకీయ సమీకరణాలు బీజేపీకి అనుకూలంగా మారాయి.
The post ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీజేపీదే appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీజేపీదే
Categories: