hyderabadupdates.com Gallery గ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి

గ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి

గ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి post thumbnail image

ఢిల్లీ : మొజాంబిక‌న్ సామాజిక కార్య‌క‌ర్త గ్రాకా మాచెల్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌న‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇందిరాగాంధీ శాంతి బహుమ‌తి ద‌క్కింది. ఇదిలా ఉండగా గ్రాకా మాచెల్ విద్య , ఆరోగ్యంలో విశేషంగా కృషి చేశారు. 2025 ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని గెలుచుకున్నారు. ఆఫ్రికా, అంతకు మించి అణగారిన వర్గాలు , సామాజిక న్యాయంపై ఆమె ప్రభావాన్ని ఈ అవార్డు గుర్తిస్తుంది. 2025 సంవత్సరానికి గాను ఇందిరా గాంధీ శాంతి నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని మొజాంబికన్ హక్కుల కార్యకర్త గ్రాకా మాచెల్ కు ప్రదానం చేస్తున్నట్లు జ్యూరీ వెల్ల‌డించింది. బుధవారం అవార్డుకు ప్రకటించిన జ్యూరీ తెలిపింది. క్లిష్ట పరిస్థితులలో విద్య, ఆరోగ్యం మరియు పోషకాహారం, ఆర్థిక సాధికారత, మానవతావాద రంగంలో ఆమె చేసిన అద్భుతమైన కృషికి గాను
ఈ అవార్డు కోసం ఎంపిక చేసిన‌ట్లు మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ అధ్యక్షతన ఉన్న అంతర్జాతీయ జ్యూరీ వెల్ల‌డించారు. ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఇందుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ , అభివృద్ధి బహుమతికి సంబంధించి రూ. కోటి నగదు, ప్రశంసా పత్రంతో కూడిన ట్రోఫీ బ‌హూక‌రిస్తారు. మాచెల్ ఒక విశిష్ట ఆఫ్రికన్ రాజనీతిజ్ఞురాలు, రాజకీయ నాయకురాలు, మానవతావాదిగా గుర్తింపు పొందారు, ఆమె జీవితాంతం స్వయం పాలన, మానవ హక్కుల రక్షణ కోసం పోరాటంలో పాతుకు పోయిందని జ్యూరీ చైర్మ‌న్ ప్ర‌క‌టించింది.
The post గ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జ‌న‌సేన ఎమ్మెల్యే వ్య‌వ‌హారంపై సమగ్ర విచార‌ణజ‌న‌సేన ఎమ్మెల్యే వ్య‌వ‌హారంపై సమగ్ర విచార‌ణ

విజ‌య‌వాడ : జ‌న‌సేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్ రాస‌లీల వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఓ ప్ర‌భుత్వ ఉద్యోగిని ప‌ట్ల ఆయ‌న అనుసరించిన తీరుపై ఆగ్రహం వ్య‌క్తం అవుతోంది. ఇదే స‌మ‌యంలో బాధితురాలు ధైర్యంగా

Vijayawada: విజయవాడలో 27 మంది మావోయిస్టులు అరెస్ట్‌Vijayawada: విజయవాడలో 27 మంది మావోయిస్టులు అరెస్ట్‌

    విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. నగర శివారు కానూరు న్యూ ఆటోనగర్‌లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ భవనాన్ని షెల్టర్‌గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం

నిర్ల‌క్ష్యం వ‌ద్దు ఫైర్ సేఫ్టీలో రాజీ ప‌డొద్దు : ఏవీ రంగ‌నాథ్నిర్ల‌క్ష్యం వ‌ద్దు ఫైర్ సేఫ్టీలో రాజీ ప‌డొద్దు : ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ : అగ్ని ప్ర‌మాదాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలని, ఫైర్ సేఫ్టీ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డొద్ద‌ని హాస్ట‌ళ్ల నిర్వాహ‌కుల‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సూచించారు. వ‌స్తున్న‌ది వేస‌వి కాలం అని, ఎక్క‌డ ఏమాత్రం పొర‌పాటు జ‌రిగినా పెనుముప్పు సంభ‌విస్తుందని