hyderabadupdates.com Gallery గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ హబ్‌గా ఏపీ

గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ హబ్‌గా ఏపీ

గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ హబ్‌గా ఏపీ post thumbnail image

దావోస్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ హబ్‌గా ఏపీని మార్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. సహజ వ్యవసాయం ఇకపై కేవలం ఎంపిక కాదని అన్నారు. భూమిని బాగు చేయడానికి ఇది అత్యంత అవ‌స‌రం అన్నారు. ఏపీలో 20 లక్షల ఎకరాల్లో ఈ పద్ధతులను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న 18 లక్షల మంది రైతులను తాము స‌మీక‌రించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ప్రకృతి ఆధారిత వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయోగశాలగా మారడానికి సిద్ధంగా ఉందని నొక్కి చెప్పారు. పెరుగుతున్న వాతావరణ సంక్షోభానికి వ్యతిరేకంగా రాష్ట్ర సహజ వ్యవసాయ నమూనాను శక్తివంతమైన శక్తిగా ప్రదర్శించారు.
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక స‌ద‌స్సులో 3వ రోజు సహజ వ్యవసాయం, ప్రత్యామ్నాయ ఆహార పంట ఉత్పత్తిపై రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. ప్రపంచ పెట్టుబడిదారులు, పర్యావరణవేత్తలను స్థిరమైన ఆహార ఉత్పత్తి వ్యవస్థలలో ఏపీని మార్గ ద‌ర్శ‌కంగా మారుస్తామ‌న్నార.సేంద్రీయ పద్ధతుల వైపు నిర్ణయాత్మక మార్పు అనేది ట్రిపుల్-విన్ వ్యూహం అన్నారు. ప్రజారోగ్యాన్ని మెరుగు పరచడం, పర్యావరణ క్షీణతను తిప్పికొట్టడం, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం అని ఆయన నొక్కి చెప్పారు. సహజ వ్యవసాయం ఇకపై కేవలం ఒక ఎంపిక కాదని, భూమిని స్వస్థపరచడానికి ఇది అవసరం అన్నారు.
రైతును ఆర్థికంగా బలోపేతం చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏకైక స్థిరమైన మార్గం అని నాయుడు అభిప్రాయపడ్డారు. సహజ వ్యవసాయం కార్బన్ సీక్వెస్ట్రేషన్‌ను మెరుగు పరిచిందని చెప్పారు.
The post గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ హబ్‌గా ఏపీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?

Harinarayan Singh : అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లడం అనేది ప్రత్యేకమే. మన దేశంలో ఇలా 10 కంటే ఎక్కువ సార్లు శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలున్నారు. బిహార్‌లోనూ అలాంటి సీనియర్‌ మోస్ట్‌ నేతలు ఉన్నప్పటికీ… ఇంతవరకూ ఎవరూ

Bus Accident: కర్నూలులో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్దం ! 20 మందికి పైగా మృతి !Bus Accident: కర్నూలులో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్దం ! 20 మందికి పైగా మృతి !

Bus Accident : కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది (Bus Accident). హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన

Minister Kiran Rijiju: రాహుల్ గాంధీకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్ట్రాంగ్ కౌంటర్Minister Kiran Rijiju: రాహుల్ గాంధీకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్ట్రాంగ్ కౌంటర్

    హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్‌తో కుమ్మక్కయినందు వల్లే బీజేపీ గెలిచిందంటూ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తిప్పికొట్టారు. రాహుల్ ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు.