hyderabadupdates.com Gallery చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్

చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్

చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్ post thumbnail image

అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన‌ ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు భారీ స్కోరు సాధించింది. రికార్డ్ బ్రేక్ చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మైదానంలోకి దిగిన భార‌త ఓపెన‌ర్లు దుమ్ము రేపారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. నిన్న‌టి దాకా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న అభిషేక్ శ‌ర్మ స‌త్తా చాటాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఇక కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ మ‌రోసారి తానేమిటో నిరూపించుకున్నాడు. త‌ను 46 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 8 సిక్స‌ర్ల‌తో 89 ర‌న్స్ చేశాడు. భారీ స్కోర్ సాధించ‌డంలో కీల‌క భూమిక పోషించాడు. ఇంకో వైపు అభిషేక్ శ‌ర్మ త‌క్కువ తిన‌లేదు. త‌ను 21 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 52 ప‌రుగుల‌తో హాఫ్ సెంచ‌రీ చేశాడు.
ఇంగ్లండ్ తో జ‌రిగిన సెమీస్ లో ఆడిన భార‌త జ‌ట్టునే తిరిగి ఫైన‌ల్ మ్యాచ్ లో కొన‌సాగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్. ఇక సంజూ శాంస‌న్ అరుదైన రికార్డు న‌మోదు చేశాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ ఫార్మాట్ లో సంజు సామ్సన్ వరుసగా రెండు నాకౌట్ మ్యాచ్‌లలో, సెమీఫైనల్ , ఫైనల్‌లో యాభై పరుగులు చేశాడు. గతంలో విరాట్ కోహ్లీ , షాహిద్ అఫ్రిది మాత్రమే ఈ ఘనతను సాధించారు. అభిషేక్ అవుట్ అయ్యాక మైదానంలోకి వ‌చ్చిన ఇషాన్ కిష‌న్ సూప‌ర్ షో చేశాడు. త‌ను కూడా ఉతికి ఆరేశాడు. 25 బాల్స్ ఎదుర్కొని 54 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. ఇక ఆఖ‌రులో వ‌చ్చిన శివ‌మ్ దూబే శివాలెత్తాడు. త‌ను కేవ‌లం 8 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 26 ర‌న్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఇండియా 5 వికెట్లు కోల్పోయి 255 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ ముందు 256 ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.
The post చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్షMinister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్ష

    మొంథా తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సచివాలయంలో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మరో 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో మంత్రి కొల్లు రవీంద్రశ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో మంత్రి కొల్లు రవీంద్ర

అమ‌రాతి : మోపిదేవిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శ‌నివారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు . ఆలయానికి వచ్చిన కొల్లు రవీంద్రకు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు

శ్రీ శారదా పీఠంలో ఘనంగా ఉగాది వేడుకలుశ్రీ శారదా పీఠంలో ఘనంగా ఉగాది వేడుకలు

హైద‌రాబాద్ : కోకాపేట విశాఖ శ్రీ శారదా పీఠంలోని శ్రీ రాజ శ్యామల అమ్మ వారి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీఠం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి పోయింది. భక్తులు