hyderabadupdates.com movies జగన్ పర్యటనలు: క్యాడర్‌కు జోష్.. జనాలకు ట్రాఫిక్ కష్టాలు

జగన్ పర్యటనలు: క్యాడర్‌కు జోష్.. జనాలకు ట్రాఫిక్ కష్టాలు

పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో బైక్‌లు.. కాన్వాయ్ నడుస్తుండగా చుట్టూ జనాలు.. పార్టీ జెండాలు.. పూల వర్షాలు.. సందర్భం ఏదైనా కావచ్చు.. పరామర్శల పేరుతో వైఎస్ జగన్ చేస్తున్న యాత్రల తీరు ఇదే. గంటలోపు పూర్తయ్యే ప్రయాణం 6 గంటల పాటు సాగడం సాధారణమైపోయింది. జనాలను సమీకరిస్తున్నారా? కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తున్నారా? అన్నది పక్కన పెడితే, దాదాపు ఏడాది కాలంగా ఒకే రీతిలో మూస పద్ధతిలో సాగుతున్న జగన్ పరామర్శ పర్యటనలపై చర్చ జరుగుతోంది.

గతంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. అంతకుముందు ఓదార్పు యాత్ర చేశారు. ఆ యాత్రలకు ఇప్పుడు చేస్తున్న పర్యటనలకు పెద్దగా తేడా కనిపించడం లేదు. ప్రజల్లో భావోద్వేగాలను ప్రేరేపించే విధంగానే ఈ యాత్రలు సాగుతున్నాయి. మరోవైపు సామాన్య జనాలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మొన్న జరిగిన గుంటూరు పర్యటన సుమారు 6 గంటల పాటు సాగింది. ఈ పర్యటన కారణంగా నగర ప్రజలు తీవ్ర ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొన్నారు. వైసీపీ యువ కార్యకర్తల హడావుడి కూడా ఎక్కువగానే కనిపించింది. అదే దృశ్యం ఇబ్రహీంపట్నం పర్యటనలో కూడా కనిపించింది.

6 గంటల పాటు జనాన్ని వెంటబెట్టుకుని ప్రయాణం చేయడం, అరగంట పాటు విలేకరులతో మాట్లాడడం, పోలీసులకు మరియు ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం వంటి అంశాలు పునరావృతమవుతున్నాయి. ‘జంగిల్ రాజ్’ అనే పదాన్ని పదేపదే ఉపయోగిస్తున్నారు. అయితే నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే మీరు ఇలా పర్యటనలు చేసేవారా? అని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతున్నందునే జగన్ ప్రశాంతంగా పర్యటిస్తున్నారని వారు అంటున్నారు.

జగన్ పర్యటనలపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు పర్యటనపై స్పందిస్తూ, గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లడానికి 6 గంటలు పట్టాలా? రోడ్డుపై ఇంకెవరూ వెళ్లకూడదా? రోడ్డంతా బ్లాక్ చేసి రౌడీయిజం చేస్తారా? అని ప్రశ్నించారు.

మొత్తం మీద వైఎస్ జగన్ పర్యటనలు ఒకే తరహాలో కొనసాగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్మెంట్ ఉన్నట్లే, ఇప్పుడు పబ్లిక్ మేనేజ్మెంట్ తరహాలో పర్యటనలు సాగుతున్నాయని చర్చ జరుగుతోంది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచడానికి ఇవి ఉపయోగపడవచ్చు. కానీ సామాన్య ప్రజల్లో మాత్రం కొంత అసహనాన్ని కలిగిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Post

`ఆ ఎమ్మెల్యేల` బాధ్య‌త మీదే.. తేల్చేసిన చంద్ర‌బాబు`ఆ ఎమ్మెల్యేల` బాధ్య‌త మీదే.. తేల్చేసిన చంద్ర‌బాబు

టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేలు త‌ప్పు చేస్తే.. వారిని స‌రిదిద్దాల్సిన బాధ్య‌త మంత్రుల‌దేన‌ని పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. జిల్లాల‌కు ఇంచార్జ్‌లుగా ఉన్న మంత్రులు.. ఆ జిల్లాలోని 7-8 మంది ఎమ్మెల్యేల‌ను కూడా ప‌ర్య‌వేక్షించ‌లేరా? అని ప్ర‌శ్నించారు. తాజాగా