hyderabadupdates.com Gallery జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌

జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌

జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌ post thumbnail image

విజ‌య‌వాడ : టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. గ‌త 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల‌లో నిర్వీర్యం చేశాడ‌ని ఆరోపించారు. అందుకే జ‌నం ఛీ కొట్టార‌ని, కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌ని అయినా బుద్ది రావ‌డం లేద‌ని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అటువంటి దారుణాలు ఎక్కడ జరిగాయో మీరు చూపించాలని అన్నారు. రోడ్లపైకి వచ్చి రౌడీ లాగా దాడులు చేస్తే అరెస్టులు చేయకూడదా? అని ప్ర‌శ్నించారు బుద్దా వెంక‌న్న‌. ఉచ్చ నీచాలు మరచి మాట్లాడిన వారిపై కేసులు పెడితే అరాచకమా అని నిల‌దీశారు. నా తండ్రి సమకాలికుడు చంద్రబాబు అని ఈరోజు జగన్ వ్యాఖ్యానించడం దారుణ‌మ‌న్నారు. ఇదేం సంస్కారం అని, బుద్ధి ముందు నుంచి ఉంటే జగన్మోహన్ రెడ్డి కి ఇంత ఘోర ఓటమి ఉండేది కాద‌న్నారు.
జగన్ అధికారంలో ఉండగా కొడాలి నాని, ద్వారంపూడి వంటి వారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటే నువ్వేం చేసావ్ జగన్ అంటూ ఫైర్ అయ్యారు. వారిని నిరోధించాల్సిన జగన్ ముసి ముసిగా నవ్వుకుంటూ వాళ్లను ప్రోత్సహించారని ఆరోపించారు బుద్దా వెంక‌న్న. దేవత లాంటి భువనేశ్వరిని ఎన్ని మాటలు ఎప్పుడన్నారో ఆనాడే టిడిపికి ఓటు వేయాలని ప్రజల నిర్ణయించుకున్నారని అన్నారు. వాళ్లు నోరు పారేసుకున్న రోజే ఖండించి ఉంటే బాగుండేదన్నారు. భువనేశ్వరి అమ్మ కూడా నా తల్లి వయసు లాంటిది చెప్పాల్సి ఉందన్నారు. ఇప్పుడు మాత్రం చిలక పలుకులు పలుకుతున్న జగన్ కు ఆరోజు ఇటువంటి సంస్కారం ఎందుకు గుర్తు రాలేన్నారు.
The post జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : బుద్దా వెంక‌న్న‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Nara Lokesh: ఈ నెల 19 నుండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనMinister Nara Lokesh: ఈ నెల 19 నుండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన

Nara Lokesh : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈనెల 19 నుంచి 24 వరకు అంటే ఆరు రోజుల పాటు ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటిస్తారు. ఈ మేరకు మంత్రి ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్

మార‌న్ కామెంట్స్ రామ్మోహ‌న్ నాయుడు ఫైర్మార‌న్ కామెంట్స్ రామ్మోహ‌న్ నాయుడు ఫైర్

న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు నిప్పులు చెరిగారు. త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈ ఏడాది జ‌రిగే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే, బీజేపీ, ఇత‌ర పార్టీల‌తో కూడిన ఎన్డీయే కూట‌మి విజ‌యం సాధించ‌క త‌ప్ప‌ద‌ని