hyderabadupdates.com Gallery జాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గ

జాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గ

జాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గ post thumbnail image

న్యూఢిల్లీ : స‌న్స్ మైక్రోసాఫ్ట్ అధినేత వినోద్ ఖోస్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల్లో ఏఐ ప్ర‌భావం అన్ని రంగాల‌లో ఉంటుంద‌ని, ముందు జాగ్ర‌త్త‌గా ప్ర‌త్యామ్నాయ మార్గాలు అన్వేషించ‌డం మంచిద‌ని సూచించారు. దేశ రాజ‌ధాని వేధిక‌గా జ‌రిగిన ఏఐ వ‌ర‌ల్డ్ స‌మ్మిట్ లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా అంత‌ర్జాతీయ మీడియాతో మాట్లాడారు. ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. ఎక్కువ‌గా ఐటీ, బిజినెస్ ప్రాసెస్ అసోసియేట్ (బీపీఓ) రంగాల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని అన్నారు. తాజాగా వినోద్ ఖోస్లా చేసిన కామెంట్స్ ఐటీ రంగంలో క‌ల‌క‌లం రేపాయి. రాబోయే రోజుల‌లో ఇండియాలోని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి ఆలోచించ‌క పోవ‌డం మంచిద‌ని సూచించారు.
ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టడం, ఉద్యోగం కోసం చదవడం అనేవి సరైన ఆలోచన కాకపోవచ్చంటూ బాంబు పేల్చారు వినోద్ ఖోస్లా. వీటి స్థానంలో రోబోలు చేరుకుంటాయ‌ని, వేలాది మంది చేసే ప‌నుల‌ను కొన్ని రోబోలు భ‌ర్తీ చేస్తాయ‌న్నారు. రాబోయే రోజుల‌లో ఏఐలో నైపుణ్యం క‌లిగిన వారికే అత్య‌ధిక ప్రాధాన్య‌త ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఆరోగ్య సంక్ష‌ర‌ణ‌, విద్యా రంగానికి కొంత మేలు చేకూరుతుంద‌ని అన్నారు. స‌న్ మైక్రోసిస్ట‌మ్స్ ను స్థాపించ‌డం లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్లు తెలిపారు. ప్ర‌పంచంలో అమెరికాకు ఎందుకంత క్రేజ్ ఉంద‌నే దానిపై కూడా క్లారిటీ ఇచ్చే ప్ర‌యత్నం చేశారు వినోద్ ఖోస్లా. మ‌నం కోరుకున్న‌ది జ‌రుగుతుంద‌ని అనుకోవ‌డానికి వీలు లేదు. కానీ వెన‌క్కి త‌గ్గ‌డం అంటూ జ‌ర‌గ‌ద‌న్నారు.
The post జాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఇటీవ‌లే త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత పై ఆస‌క్తిక‌ర

సాగు నీటి ప్రాజ‌క్టుల కోసం రూ. 8 వేల కోట్లుసాగు నీటి ప్రాజ‌క్టుల కోసం రూ. 8 వేల కోట్లు

అనంత‌పురం జిల్లా : సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని కూట‌మి స‌ర్కార్ రాష్ట్రంలో నీటి ప్రాజ‌క్టుల‌కు భారీ ఎత్తున నిధుల‌ను కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. గార్లదిన్నె మండలం బూదేడు గ్రామ సమీపంలోని 8వ డిస్ట్రిబ్యూటరీ

శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టంశ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టం

తిరుమ‌ల : శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు .తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో