hyderabadupdates.com movies టాక్సిక్… భలే తెలివైన ఎస్కేప్

టాక్సిక్… భలే తెలివైన ఎస్కేప్

దురంధర్ 2తో ఫేస్ టు ఫేస్ తలపడదామని డిసైడైపోయి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టుకున్న యష్ టాక్సిక్ కొద్దిరోజుల ముందు హఠాత్తుగా వాయిదా ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని కారణంగా చెప్పుకున్నారు కానీ పోటీ వల్లే నిర్ణయం మార్చుకున్నారనేది ఓపెన్ సీక్రెట్. అందులోనూ ప్రమోషన్లకు తగినంత సమయం లేకపోవడంతో యష్ బృందం వెనుకడుగు వేయక తప్పలేదు.

దీన్ని గ్రేటెస్ట్ ఎస్కేప్ అఫ్ ది డికేడ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దురంధర్ ది రివెంజ్ నమోదు చేస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ నోరెళ్లబెడుతోంది. కేవలం ప్రీమియర్ షోలకు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే పన్నెండు కోట్లకు పైగా వసూలు కావడం ఊహించని రికార్డు. ఈ మూవీ మీద జనంలో విపరీతమైన ఆసక్తి ఉన్న మాట నిజమే కానీ అది ఈ స్థాయిలో అనేది బహుశా దర్శక నిర్మాతలైనా ఊహించారో లేదో.

ఒకవేళ టాక్సిక్ కనక మాట మార్చకుండా కాంపిటీషన్ కు సిద్ధపడి ఉంటే దారుణంగా ఎఫెక్ట్ అయ్యేది. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలన్నీ దురంధర్ రివెంజ్ ఫీవర్ లో ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వైపు బయ్యర్లు ఈ సినిమా తప్ప వేరే షో వేసేందుకు ఇష్టపడటం లేదు. అందులోనూ 3 గంటల 55 నిమిషాల నిడివి కాబట్టి రోజుకు నాలుగు కంటే ఎక్కువ షోలకు ఛాన్స్ లేదు. అందుకే స్క్రీన్లు పెంచి కలెక్షన్లు రాబట్టుకునే ప్రయత్నాల్లో డిస్ట్రిబ్యూటర్లు బిజీగా ఉన్నారు.

ఈ సునామీని తట్టుకోవడం టాక్సిక్ కు ఖచ్చితంగా కష్టం అయ్యేది. అందులోనూ టీజర్ వచ్చి అంచనాలను విపరీతంగా పెంచలేకపోయింది. దీనికి కొన్ని కోర్టు వివాదాలు, సెన్సార్ చిక్కులు వచ్చే అవకాశం ఉన్నందున సావధానంగా వాటిని పరిష్కరించుకోవాలి.

టాక్సిక్ టీమ్ ఏకంగా జూన్ కు వెళ్ళిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ కు ఈ రిస్క్ లేదు. టార్గెట్ చేసింది కేవలం తెలుగు మార్కెట్లనే కాబట్టి మంచి టాక్ వస్తే చాలు ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ వసూళ్ళలో గట్టెక్కిపోతుంది. మొత్తానికి టాక్సిక్ అయితే భలే తప్పించుకుందనేది ఎవరూ కాదనలేని ఓపెన్ కామెంట్.

Related Post

ట్రెండీ దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ?ట్రెండీ దర్శకుడికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ?

వరస డిజాస్టర్లతో నితిన్ బాగా డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు దారుణంగా బోల్తా కొట్టడం ఒక ఎత్తయితే, పెద్ద బడ్జెట్ తో ఎల్లమ్మని ప్లాన్ చేసుకున్న నిర్మాత దిల్ రాజు ఇప్పుడా ప్రాజెక్టుకి దేవిశ్రీ ప్రసాద్

ట్రంప్ కొత్త ‘డప్పు’!ట్రంప్ కొత్త ‘డప్పు’!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ‘డప్పు’ కొట్టుకున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య మే నెలలో జరిగిన ఉద్రిక్తతలను తానే స్వయంగా ఆపానని, లేకపోతే అది అణు యుద్ధానికి దారితీసేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి దాదాపు 50

ఫ్యాక్ట్ చెక్: ఇంద్రకీలాద్రికి కరెంట్ కట్?ఫ్యాక్ట్ చెక్: ఇంద్రకీలాద్రికి కరెంట్ కట్?

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దేవస్థానానికి సంబంధించి విద్యుత్ బిల్లుల అంశంపై ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. లక్షల మంది భక్తులు సందర్శించుకునే ఈ ఆలయానికి బిల్లులు బకాయిలు ఉన్నాయనే కారణంతో గంటసేపు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం.. ఆ వెంటనే