hyderabadupdates.com Gallery టీమిండియాపై ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్

టీమిండియాపై ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్

టీమిండియాపై ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్ post thumbnail image

ముంబై : ఐసీసీ టి20 టోర్న‌మెంట్ లో ఊహంచ‌ని రీతిలో బిగ్ షాక్ త‌గిలింది ద‌క్షిణాఫ్రికా చేతిలో. ఏకంగా 76 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. టీమిండియా అస‌లైన కీల‌క మ్యాచ్ ఈనెల 26న గురువారం జ‌ర‌గ‌నుంది. విచిత్రం ఏమిటంటే ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం. దీంతో పాటు మ‌రో మ్యాచ్ వెస్టిండీస్ తో జ‌ర‌గాల్సి ఉంది. ఈ సంద‌ర్బంగా మాజీ భార‌త జ‌ట్టు కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి స్పందించాడు. స‌ఫారీల‌తో ఊహించ‌ని షాక్ త‌గిలింది. సూపర్ 8లలో దక్షిణాఫ్రికాపై జరిగిన ఓటమిని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి మారువేషంలో ఉన్న వరంలా భావిస్తున్నాడు. ఇదే స‌మ‌యంలో భార‌త జ‌ట్టులో కీల‌క‌మైన మార్పులు చేయాల్సి ఉంది.
కాగా టి20 ప్ర‌పంచ క‌ప్ కు సంబంధించి గ‌త రెండు ఎడిష‌న్ల‌లో వ‌రుస‌గా 12 విజ‌యాల త‌ర‌వ్ఆత భార‌త్ ఎదుర్కొన్న మొద‌టి ఓట‌మి. ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం. దీనిపై ఫుల్ ఫోక‌స్ పెట్టాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ స్థానంలో వైస్-కెప్టెన్ అక్షర్ పటేల్‌ను తీసుకు రావాలని ఆయన అనుకూలంగా ఉన్నారు. అక్షర్ పటేల్ ఆడుతుంటే, అతను 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తుంటాడు. 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో శివం దుబే, 7వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. 5వ స్థానంలో అక్షర్ కూడా వెళ్లవచ్చు అని పేర్కొన్నాడు.
The post టీమిండియాపై ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

న‌ల్ల మ‌ల్లారెడ్డి ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా చ‌ర్య‌లున‌ల్ల మ‌ల్లారెడ్డి ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా చ‌ర్య‌లు

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. క‌బ్జాదారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించేలా చేస్తోంది. క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదిలా ఉండ‌గా స‌రిగ్గా ఏడాది క్రితం దివ్యా న‌గ‌ర్ లే ఔట్‌లో అడ్డుగోడ‌ల‌ను తొల‌గించిన హైడ్రా మ‌ళ్లీ అక్క‌డే

రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ వెరీ స్పెష‌ల్రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ వెరీ స్పెష‌ల్

హైద‌రాబాద్ : మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ మూవీ నిర్మాత‌, చిరంజీవి ముద్దుల కూతురు సుస్మిత కొణిద‌ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న సోద‌రుడు, ప్ర‌ముఖ న‌టుడు రామ్ చ‌ర‌ణ్ డ్రెస్సింగ్ గురించి స్పందించింది. రామ్ చరణ్ ఫిట్, సౌకర్యం, హుందాతనానికి

మార్చి 1న తమిళనాడుకు ప్రధాని మోదీమార్చి 1న తమిళనాడుకు ప్రధాని మోదీ

త‌మిళ‌నాడు : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ త‌మిళ‌నాడులో ప‌ర్యటించ‌నున్నారు. మార్చి 1వ తేదీన అధికారికంగా జ‌రిగే కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన రాత్రికి చెన్నైకి చేరుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన