hyderabadupdates.com movies టీమిండియా దెబ్బకు పాకిస్థాన్‌ చిత్తుగా..

టీమిండియా దెబ్బకు పాకిస్థాన్‌ చిత్తుగా..

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన అత్యంత క్రేజీ ఫైట్‌లో టీమిండియా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. స్పిన్నర్లకు స్వర్గధామం లాంటి ఈ పిచ్‌పై పాక్ ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగి భారీ ఆశలు పెట్టుకున్నా, మన బ్యాటర్ల ముందు వారి వ్యూహాలు పారలేదు. తెలివైన ఆటతీరుతో భారత్ మరోసారి దాయాదులపై పైచేయి సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మా మొదట్లోనే వెళ్లినా మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్కడే పాక్ బౌలర్లపై ఊచకోత కోస్తూ కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు రాబట్టాడు. సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్ వర్మ (25) విలువైన పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. పాక్ బౌలర్లలో సయిమ్ అయూబ్ 3 వికెట్లు తీసినా, భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో మిగిలిన వారు విఫలమయ్యారు.

అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్, భారత బౌలర్ల ధాటికి 18 ఓవర్లలోనే 114 పరుగులకు కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ (44) ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా అతనికి మిగిలిన వారి నుంచి సహకారం అందలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లతో రాణించి పాక్ పతనాన్ని శాసించారు.

ఈ మ్యాచ్‌కు ముందు వాతావరణం, పిచ్ పరిస్థితులపై ఎన్నో చర్చలు జరిగినా మైదానంలో మాత్రం భారత్ ఏకపక్షంగా చెలరేగిపోయింది. ముఖ్యంగా పాక్ స్పిన్నర్ల ప్రభావం ఈ పిచ్‌పై ఎక్కువగా ఉంటుందని భావించినా, భారత బ్యాటర్లు వారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పాక్ బ్యాటింగ్ లైనప్ మన బౌలర్ల ముందు ఏమాత్రం నిలవలేకపోయింది. అంచనాలకు తగ్గట్టుగా ఈ పోరు హోరాహోరీగా సాగకపోయినా, భారత్ ప్రదర్శన మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఈ విజయంతో టీమిండియా గ్రూప్-ఏలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సూపర్-8 బెర్తును ఖాయం చేసుకుంది. వరుసగా అమెరికా, నమీబియా, ఇప్పుడు పాకిస్థాన్‌లపై గెలిచి టీమిండియా మంచి జోరు మీద ఉంది. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఈసారి వరల్డ్ కప్ మనదే అన్న ధీమా అభిమానుల్లో కనిపిస్తోంది.

Related Post

AR Rahman Clarifies Remarks on Alleged Religious Bias in BollywoodAR Rahman Clarifies Remarks on Alleged Religious Bias in Bollywood

Renowned music composer A. R. Rahman has issued a clarification after his recent remarks on alleged religious bias in Bollywood sparked widespread debate. The controversy followed an interview with BBC

ఏపీలో మరో ‘జీవీఎంసీ’ రాబోతోందా?ఏపీలో మరో ‘జీవీఎంసీ’ రాబోతోందా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు విజయవాడ నగరం పాలనకు కీలకంగా మారింది. ఆల్రెడీ అభివృద్ధి చెందిన విజయవాడను విస్తరిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు చాలాకాలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ