hyderabadupdates.com Gallery టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్

టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్

టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్ post thumbnail image

చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. శుక్ర‌వారం ఐటీ శాఖ జారీ చేసిన కేసుకు సంబంధించి సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ మేర‌కు ఆయ‌న‌కు ప్ర‌తికూలంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. దీంతో త‌న‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ త‌గిలింది. ఇదిలా ఉండ‌గా ఆదాయ వివ‌రాలు వెల్ల‌డించ లేదంటూ ఐటీ శాఖ ఆరోప‌ణ‌లు చేసింది. ఈ మేర‌కు గ‌త ఏడాది త‌న ఇళ్లు, ఆఫీసు, పార్టీ కార్యాల‌యంలో దాడులు చేప‌ట్టింది. ఈ మేర‌కు విజ‌య్ కు రూ. 1.50 కోట్ల జ‌రిమానా విధించింది. కాగా ఐటీ శాఖ జారీ చేసిన జ‌రిమానాపై స‌వాల్ చేస్తూ న‌టుడు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేస్తూ ఐటీ శాఖ జారీ చేసింది స‌బ‌బేన‌ని అభిప్రాయ‌ప‌డింది. అంతే కాకుండా తక్ష‌ణ‌మే కోటిన్న‌ర రూపాయ‌ల‌ను చెల్లించాల్సిందేన‌ని ఆదేశించింది. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని విజ‌య్ ను హెచ్చ‌రించింది ధ‌ర్మాసనం.
ఈ సంద‌ర్బంగా విజ‌య్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను కొట్టి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ పిటిషన్ 2022లో దాఖలు చేశారు. ఈ జ‌రిమానా 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది. విజయ్ రూ. 15 కోట్ల ఆదాయాన్ని వెల్లడించలేదని ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది, ఆ తర్వాత జరిమానా విధించింది. ఈ కేసును ఏకసభ్య న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి విచారించారు, ఆయన జనవరి 23, 2026న తన తీర్పును రిజర్వ్ చేశారు. తన ఉత్తర్వులో, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 263 ప్రకారం నిర్దేశిత కాలపరిమితిలోనే షోకాజ్ నోటీసు జారీ చేశార‌ని పేర్కొన్నారు. నోటీసు జారీ చేసిన విధానంలో ఎలాంటి లోపం లేదని గమనించిన కోర్టు, కేసులోని ఇతర అంశాలను పరిశీలించడానికి నిరాకరించింది, తద్వారా ఆదాయపు పన్ను శాఖ జరిమానా ఉత్తర్వు యథాతథంగా కొనసాగడానికి అనుమతించింది.
The post టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లుమ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు

అమ‌రావ‌తి : కేంద్రం తీపి క‌బురు చెప్పింది. ఏపీలోని మ‌చిలీప‌ట్నం పోర్డు రోడ్డు అనుసంధానం కోసం ఏకంగా రూ. 570 కోట్లు మంజూరు చేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు కేంద్ర ఉపరిత‌ల, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. ఈ

పేద‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాలిపేద‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాలి

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పేద‌ల‌కు మెరుగైన రీతిలో వైద్య సేవ‌లు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. గుండె సంబంధిత వ్యాధుల నివారించాలన్న లక్ష్యంతో అందరం కలిసి ఒక మిషన్‌గా పని చేద్దామని పిలుపునిచ్చారు.

పైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీపైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. పూర్తి పార‌దర్శ‌క‌తో పాల‌న సాగిస్తున్నామ‌ని చెప్పారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామ‌న్నారు. భవిష్యత్