చెన్నై : ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. శుక్రవారం ఐటీ శాఖ జారీ చేసిన కేసుకు సంబంధించి సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఆయనకు ప్రతికూలంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో తనకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇదిలా ఉండగా ఆదాయ వివరాలు వెల్లడించ లేదంటూ ఐటీ శాఖ ఆరోపణలు చేసింది. ఈ మేరకు గత ఏడాది తన ఇళ్లు, ఆఫీసు, పార్టీ కార్యాలయంలో దాడులు చేపట్టింది. ఈ మేరకు విజయ్ కు రూ. 1.50 కోట్ల జరిమానా విధించింది. కాగా ఐటీ శాఖ జారీ చేసిన జరిమానాపై సవాల్ చేస్తూ నటుడు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టింది కోర్టు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఐటీ శాఖ జారీ చేసింది సబబేనని అభిప్రాయపడింది. అంతే కాకుండా తక్షణమే కోటిన్నర రూపాయలను చెల్లించాల్సిందేనని ఆదేశించింది. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విజయ్ ను హెచ్చరించింది ధర్మాసనం.
ఈ సందర్బంగా విజయ్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పిటిషన్ 2022లో దాఖలు చేశారు. ఈ జరిమానా 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది. విజయ్ రూ. 15 కోట్ల ఆదాయాన్ని వెల్లడించలేదని ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది, ఆ తర్వాత జరిమానా విధించింది. ఈ కేసును ఏకసభ్య న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్కుమార్ రామమూర్తి విచారించారు, ఆయన జనవరి 23, 2026న తన తీర్పును రిజర్వ్ చేశారు. తన ఉత్తర్వులో, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 263 ప్రకారం నిర్దేశిత కాలపరిమితిలోనే షోకాజ్ నోటీసు జారీ చేశారని పేర్కొన్నారు. నోటీసు జారీ చేసిన విధానంలో ఎలాంటి లోపం లేదని గమనించిన కోర్టు, కేసులోని ఇతర అంశాలను పరిశీలించడానికి నిరాకరించింది, తద్వారా ఆదాయపు పన్ను శాఖ జరిమానా ఉత్తర్వు యథాతథంగా కొనసాగడానికి అనుమతించింది.
The post టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కు హైకోర్టు బిగ్ షాక్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కు హైకోర్టు బిగ్ షాక్
Categories: