hyderabadupdates.com movies డబుల్ రిస్కు ఎందుకు శర్వా

డబుల్ రిస్కు ఎందుకు శర్వా

శర్వానంద్ సినిమా చూసి నెలలు కాదు ఏడాది పైగానే గడిచిపోయింది. మనమే తర్వాత మళ్ళీ తెరమీద కనిపించలేదు. బైకర్ తో వచ్చే నెల డిసెంబర్ 6 థియేటర్లకు రాబోతున్న సంగతి తెలిసిందే. బైక్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఛేజింగ్ డ్రామాని ఏకంగా హాలీవుడ్ మూవీ ఎఫ్1 తో పోల్చడం చూస్తే టీమ్ నమ్మకం మాములుగా లేదు. అయితే ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న విషయం ఒకటే. ముందు రోజు అఖండ 2 రిలీజ్, దానికి వారం ముందు ఆంధ్రకింగ్ తాలూకా పెట్టుకుని ఇంత కాంపిటీషన్ మధ్య రావడం ఎందుకాని. సోలో అయితే బైకర్ ఇంకా బాగా అదరగొడుతుందని వీళ్ళ నమ్మకం.

అసలు ట్విస్టు మరొకటి ఉంది. శర్వానంద్ మరో చిత్రం నారి నారి నడుమ మురారిని సంక్రాంతికే విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాత ఉన్నారట. బైకర్ చేసేదే పెద్ద రిస్క్. ఇప్పుడీ నారినారి కూడా పండగ బరిలో దిగితే ఇది అంత కన్నా రెట్టింపు గ్యాంబ్లింగ్ మరొకటి ఉండదు. ఎందుకంటే మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, ది రాజా సాబ్, జన నాయకుడు, పరాశక్తితో ఆల్రెడీ అరడజను సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటి మధ్య ఏడో ఎంట్రీగా నారీనారీ నడుమ మురారి ఎదురీదాల్సి ఉంటుంది. సినిమా బాగుండొచ్చు. ముందైతే సరిపడా థియేటర్లు దొరకాలి కదా.

సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన నారీనారీ నడుమమురారి హీలేరియస్ గా వచ్చిందట. అంత మాత్రాన కాంపిటీషన్ కు ఎదురెళితే ఓపెనింగ్స్ తో పాటు ఫైనల్ రన్ ప్రభావితం చెందుతాయి. పైన చెప్పిన వాటిలో ఒకటో రెండో వాయిదా పడతాయన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఎవరికి వారు డెడ్ లైన్స్ పెట్టుకుని మరీ పని చేస్తున్నారు. అలాంటప్పుడు ఎవరో తప్పుకుంటారని ఆశించి డేట్ వేసుకోవడం సబబు కాదేమో. బైకర్ రిలీజ్ తర్వాత నారి నారి పబ్లిసిటీ పర్వం మొదలవ్వొచ్చు. సీజన్ ఎంపిక వెనుక ఓటిటితో చేసుకున్న డీల్ కూడా ఒక కారణమని అనఫీషియల్ టాక్.

Related Post

Sree Vishnu and Ram Abbaraju Join Hands Again for New Comedy FilmSree Vishnu and Ram Abbaraju Join Hands Again for New Comedy Film

Mythri Movie Makers, one of India’s top production houses, has announced a brand-new film with actor Sree Vishnu and director Ram Abbaraju. The duo earlier gave the blockbuster comedy Samajavaragamana.

మాల్దీవ్స్ తరహాలో… ఏపీలో ఐ ల్యాండ్ టూరిజంమాల్దీవ్స్ తరహాలో… ఏపీలో ఐ ల్యాండ్ టూరిజం

పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030 నాటికి ఆసియాలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా ఎదగడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రణాళికలు తయారు చేస్తుంది. సూర్యలంకతో పాటు సూళ్లూరు