hyderabadupdates.com movies డాలర్ @ 90: మీ జేబుకు చిల్లు పడేది ఎక్కడో తెలుసా?

డాలర్ @ 90: మీ జేబుకు చిల్లు పడేది ఎక్కడో తెలుసా?

“రూపాయి విలువ పడిపోయింది” అనే వార్త చూడగానే.. “మనకేంటిలే, మనం ఇండియాలోనే ఉన్నాం కదా” అని లైట్ తీసుకుంటే పొరపాటే. డాలర్ విలువ 90 రూపాయలు దాటడం అనేది కేవలం మార్కెట్ గణాంకం కాదు, మన వంటింట్లో, మన పిల్లల చదువుల్లో మోగిన డేంజర్ బెల్. ఈ పతనం ప్రభావం సామాన్యుడి మీద డైరెక్ట్‌గా ఉండదు కానీ, ఇన్ డైరెక్ట్‌గా మన బడ్జెట్‌ను తలకిందులు చేసే ప్రమాదం ఉంది.

అందరికంటే ఎక్కువగా నష్టపోయేది విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులే. నిన్నటి దాకా ఒక డాలర్‌కి 83, 84 రూపాయలు పంపిన వాళ్లు, ఇప్పుడు 90 రూపాయలు పంపాలి. అంటే ఫీజుల రూపంలో, ఖర్చుల రూపంలో అదనంగా లక్షల రూపాయల భారం పడుతుంది. ఇప్పటికే లోన్లు తీసుకుని పిల్లలను పంపిన వారికి, ఈ మారిన రేటు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అమెరికాలో చదువు అనేది ఇప్పుడు మరింత కాస్ట్లీ వ్యవహారంగా మారింది.

ఇక ఎలక్ట్రానిక్స్ ప్రియులకు కూడా ఇది చేదు వార్తే. మనం వాడే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల విడిభాగాల్లో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. డాలర్ రేటు పెరిగితే, ఆటోమేటిక్‌గా వాటి ధరలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో కొత్త గ్యాడ్జెట్స్ కొనాలంటే జేబుకు గట్టిగానే చిల్లు పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లలోనే చెల్లిస్తాం కాబట్టి, పరోక్షంగా రవాణా ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది.

అయితే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. రూపాయి ఇంతలా పతనమవుతున్నా మన రిజర్వ్ బ్యాంక్ (RBI) ఎందుకు పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు? సాధారణంగా డాలర్లను అమ్మి రూపాయిని కాపాడుతుంది. కానీ ఈసారి ఆర్‌బీఐ “సైలెంట్ మోడ్”లో ఉంది. ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) అదుపులోనే ఉంది కాబట్టి, రూపాయిని బలవంతంగా ఆపడం కంటే, దేశ ఎకానమీ గ్రోత్ మీదే ఫోకస్ పెట్టాలని ఆర్‌బీఐ డిసైడ్ అయినట్లు నిపుణులు అంటున్నారు. ఇదొక వ్యూహాత్మక మౌనం అనుకోవచ్చు.

అమెరికాతో జరగాల్సిన వాణిజ్య ఒప్పందం లేట్ అవ్వడమే ఈ కొంపముంచింది. ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవడంతో రూపాయి కుదేలైంది. ప్రభుత్వం చెబుతున్నట్లు రాబోయే రెండు నెలల్లో అంతా సెట్ అవుతుందా? లేక డాలర్ 100 వైపు పరుగులు పెడుతుందా? అనేది చూడాలి. ఏది ఏమైనా, ఫారిన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్న వాళ్లు, పిల్లలను బయటకు పంపేవాళ్లు మాత్రం తమ బడ్జెట్‌ను మళ్లీ లెక్కేసుకోవాల్సిందే.

Related Post

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..9 మంది మృతికాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..9 మంది మృతి

శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య

సినిమా హిట్… దర్శకుడికి జీరో క్రెడిట్సినిమా హిట్… దర్శకుడికి జీరో క్రెడిట్

దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. ఒక సినిమా కోసం ఎన్ని వందల మంది కష్టపడినప్పటికీ.. అది హిట్టయినా, ఫ్లాపైనా మేజర్ క్రెడిట్ దర్శకుడి ఖాతాలోకే వెళ్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం హిట్టయినా దర్శకుడికి క్రెడిట్ రాని పరిస్థితి

బీఆర్ ఎస్ అందుకే ఓడిపోయింది: రేవంత్‌రెడ్డి విప్పిన గుట్టు…!బీఆర్ ఎస్ అందుకే ఓడిపోయింది: రేవంత్‌రెడ్డి విప్పిన గుట్టు…!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న కామెంట్లు చేశారు. 2023లో బీఆర్ ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింద‌న్న విషయం ఇప్ప‌టికీ స‌స్పెన్సుగానే ఉంది. “అరె..మేం ఏం త‌క్కువ చేసినం. అయినా ఎందుకు ఓడ‌గొట్టారు?“ అని మాజీ సీఎం, బీఆర్ ఎస్