hyderabadupdates.com Gallery డ్ర‌గ్ టెస్టుకు నేను సిద్దం మీరు రెడీనా..?

డ్ర‌గ్ టెస్టుకు నేను సిద్దం మీరు రెడీనా..?

డ్ర‌గ్ టెస్టుకు నేను సిద్దం మీరు రెడీనా..? post thumbnail image

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎం రేవంత్ రెడ్డి డ్ర‌గ్స్ తీసుకుంటున్నాన‌ని నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌వుల‌లో ఉన్న మీరంతా ఆధారాలు లేకుండా ఎలా కామెంట్స్ చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు కేటీఆర్. ద‌మ్ముంటే మీలో ఖ‌లేజా అనేది ఉంటే తాను డ్ర‌గ్స్ తీసుకుంటున్న‌ట్లు నిరూపించాల‌ని స‌వాల్ విసిరారు. ఇదే స‌మ‌యంలో మీరు చేసిన ఆరోప‌ణ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటారా అని ప్ర‌శ్నించారు.
ఉగాది సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శ్రీ ప‌రాభావ నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో త‌నపై లేకి కామెంట్స్ చేసిన మీరంతా డ్ర‌గ్స్ టెస్టుల‌కు సిద్దం కావాల‌ని స‌వాల్ విసిరారు. ఆ ద‌మ్ము మీలో ఉందా అని ఫైర్ అయ్యారు కేటీఆర్. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉన్నట్లుంద‌ని అన్నారు. ఆయన విషయంలో మేం ఎలాంటి చర్చలు చేయ లేద‌ని చెప్పారు మాజీ మంత్రి.
మమ్మల్ని తట్టుకోవడమే సర్కార్ వల్ల కావడం లేదని, వాళ్లకు కేసీఆర్ ఎందుకు కావాల‌ని ప్ర‌శ్నించారు. నిషేధిత భూములపై మంత్రి పొంగులేటి ఎందుకు నోరు మెదపట్లేదని నిప్పులు చెరిగారు కేటీఆర్. కోటి ఎకరాలు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయని అన్నారు. పొంగులేటి కొడుకు కబ్జాలు చేస్తే అక్కడున్న ఆఫీసర్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేశారని ఆరోపించారు.
The post డ్ర‌గ్ టెస్టుకు నేను సిద్దం మీరు రెడీనా..? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Trump Junior: తాజ్‌మహల్‌ను సందర్శించిన జూనియర్ ట్రంప్Trump Junior: తాజ్‌మహల్‌ను సందర్శించిన జూనియర్ ట్రంప్

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తాజ్ మహల్‌ను సందర్శించారు. సుమారు గంటసేపు తాజ్ ఆవరణలో గడిపారు. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఆగ్రాకు చేరుకున్న ఆయన… అక్కడి డయానా బెంచ్‌ సహా

ఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కంఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కం

న్యూఢిల్లీ : ఏఐ ప్రయోజ‌నాల‌ను అంద‌రికీ అందుబాటులో ఉంచ‌డంలో యుఎస్, భార‌త భాగ‌స్వామ్యం కీల‌క పాత్ర పోషించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్. రెండు దేశాల మధ్య అలంకారికంగా, అక్షరాలా కనెక్షన్ పాయింట్‌గా పని చేయడం పట్ల గూగుల్

YS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖYS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ

    కృష్ణా జలాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్… ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు. ట్రిబ్యునల్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున గట్టిగా వాదనలు వినిపించి… ఏపీకు