hyderabadupdates.com movies తమిళ హీరోలు మొదలెట్టారు ప్రసాదు

తమిళ హీరోలు మొదలెట్టారు ప్రసాదు

టాలీవుడ్ లెజెండరీ నటుడు రాజేంద్ర ప్రసాద్.. ఈ మధ్య స్టేజ్ ఎక్కాడంటే చాలు ఏం మాట్లాడతాడో, ఏం బాంబులు పేలుస్తాడో అని అందరూ తలలు పట్టుకునే పరిస్థితి తలెత్తుతోంది. ‘రాబిన్ హుడ్’ వేడుకలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను దొంగనాకొడుకు వీడు అనడం.. మరో సినీ ఫంక్షన్లో కమెడియన్ ఆలీని ఉద్దేశించి పచ్చి బూతు మాట వాడడం.. ఒకప్పటి హీరోయిన్ రవళిని బాడీ షేమింగ్ చేయడం.. ఇలా పలు సందర్భాల్లో అదుపు తప్పి మాట్లాడిన ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు.

ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన తీరు మారట్లేదు. తాజాగా తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్ గురించి ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. తెలుగు దిగ్గజ నటుడు కాంతారావు చేసిన జానపద చిత్రాలు చూసి ఎంజీఆర్ భయపడ్డారంటూ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ ఒక వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడడం వివాదాస్పదమైంది. ఆయన మాట్లాడింది తెలుగులోనే అయినా.. సోషల్ మీడియా కాలం కావడంతో తమిళ జనాలకు విషయం చేరింది.

తమిళులు ఎంజీఆర్‌ను దేవుడిలా చూస్తారు. అలాంటి వ్యక్తి గురించి రాజేంద్ర ప్రసాద్ ఇలా అనడంతో దుమారం రేగింది. దీనిపై తెలుగువాడే అయిన తమిళ హీరో విశాల్ తాజాగా స్పందించాడు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యల మీద అతను అభ్యంతరం వ్యక్తం చేశాడు.

‘‘మీపై గౌరవం, మీరు చేసిన వ్యాఖ్యలపై బాధతో ఈ పోస్టు పెడుతున్నా. ఎంజీఆర్‌పై మీరు చేసిన వ్యాఖ్యలు విని బాధ పడ్డాను. దిగ్గజ నటుడు కాంతారావును పొగడ్డం మంచి విషయమే. కానీ ఈ క్రమంలో తమిళ ప్రజలు దైవంలా భావించే ఎంజీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడ్డంతో నాతో పాటు ఎంతోమంది బాధ పడ్డారు. మిమ్మల్ని క్షమాపణలు చెప్పమని అడుగుతున్నందుకు నన్ను మన్నించండి. కానీ భవిష్యత్తులో ఎవరు ఇలా మాట్లాడినా నేను ఇలాగే స్పందిస్తాను. ఈ వివాదానికి ముగింపు పలకండి’’ అని విశాల్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన వ్యాఖ్యలపై సారీ చెప్పక తప్పేలా లేదు.

Related Post

Vara Prasad Becomes Biggest Grosser For Chiru, AnilVara Prasad Becomes Biggest Grosser For Chiru, Anil

This Sankranthi, Telugu cinema witnessed heavy competition, with good number of movies arriving in cinemas. Interestingly, most of the movies were family-friendly entertainers. However, Megastar Chiranjeevi and hit machine Anil

అతడు స్టామినాని వృథా చేస్తున్నారుఅతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే ఉంది. రేపు అతడుని మళ్ళీ విడుదల చేస్తున్నారు. బుకింగ్స్ ఏమంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఇవాళ రాత్రి హైదరాబాద్ లో