hyderabadupdates.com Gallery తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం post thumbnail image

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ముఖ్యమంత్రి హోదా లో మహా ద్వారం ప్రవేశ అవకాశం ఉన్నా సామాన్య భక్తుల్లా శ్రీవారి దర్శనానికి సీఎం చంద్రబాబు కుటుంబం ద‌ర్శించు కోవ‌డం విశేషం. ఎప్పుడు శ్రీవారి దర్శనానికి వెళ్ళినా వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుంచే దర్శనానికి వెళుతున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి దర్శనానికి సీఎం కుటుంబం ప్ర‌తి ఏటా రావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.
ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, సతీమణి నారా బ్రాహ్మణి, దేవాన్ష్ ఉన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్ కు వెళ్లారు. అక్క‌డ శ్రీ‌వారి భ‌క్తుల‌కు అప్యాయంగా అన్న ప్రసాద వితరణ చేశారు సీఎం చంద్ర‌బాబు, కుటుంబం. ఒక్కరోజు అన్న దానానికి వ్యయం అయ్యే రూ.44 లక్షల విరాళాన్ని ఇప్పటికే అందించింది సీఎం కుటుంబం. ప్ర‌తి ఏటా వెంగ‌మాంబ అన్న ప్ర‌సాదానికి భూరి విరాళం అంద‌చేస్తూ వ‌స్తున్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇదిలా ఉండ‌గా ఇప్పటికీ 12 మార్లు అన్నదానానికి ఎస్వీ అన్నదాన ట్రస్ట్ కు విరాళం ఇచ్చారు.
సీఎం , కుటుంబం రాక సంద‌ర్బంగా తిరుమ‌లలో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. అంత‌కు ముందు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌, ఏఈవో వెంక‌య్య చౌద‌రి, జేఈఓలు వి. వీర‌బ్ర‌హ్మం, డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్ తో పాటు పూజారులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.
The post తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలుశ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుప‌తి : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుప‌తి లోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు 7వ తేదీ శ‌నివారం అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. ఆలయంలో 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’

అమరావతి : ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’. త్యాగానికి మానవ రూపం పొట్టి శ్రీరాములు అన పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. వారి విగ్రహం ఏర్పాటు తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనిపేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు

మెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలిమెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి

తిరుప‌తి : టీటీడీ జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని అధ్యాపకులకు సూచించారు. గురువారం ఆయన ఆక‌స్మికంగా