hyderabadupdates.com movies తుపాకీ కాల్పులు వల్ల నటుడి బిజినెస్ ఇంకా పెరిగిందట

తుపాకీ కాల్పులు వల్ల నటుడి బిజినెస్ ఇంకా పెరిగిందట

కెనడాలో తన కేఫ్‌పై జరిగిన వరుస కాల్పుల గురించి స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తొలిసారి నోరు విప్పాడు. అక్కడ మూడుసార్లు అటాక్స్ జరిగినా, తనకేం భయం లేదన్నట్లుగా మాట్లాడాడు. తన కొత్త సినిమా ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ విషయంపై స్పందిస్తూ, కెనడా పోలీసుల తీరుపై పరోక్షంగా సెటైర్లు వేశాడు. బహుశా అక్కడి రూల్స్ వల్ల పోలీసులకు ఇలాంటి ఘటనలను కంట్రోల్ చేసే పవర్ లేదేమో అనిపిస్తోందని అన్నాడు.

ఇదే సమయంలో ముంబై పోలీసులపై మాత్రం కపిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. “నాకు మన దేశంలో, ముఖ్యంగా ముంబైలో ఉన్నంత సేఫ్ ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. ముంబై పోలీసుల పనితీరు ఎంత షార్ప్‌గా ఉంటుందో మనందరికీ తెలుసు. వేరే ఏ సిటీ కూడా ముంబైకి సాటి రాదు” అని తేల్చి చెప్పాడు. విదేశాల్లో రక్షణ లేకపోయినా, మన దగ్గర మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఉందని గర్వంగా చెప్పుకున్నాడు.

ఇక్కడే కపిల్ శర్మ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. సాధారణంగా తుపాకీ కాల్పులు జరిగితే జనాలు భయపడి షాపుకు రారు. కానీ తన కేఫ్ విషయంలో సీన్ రివర్స్ అయ్యిందట. “ప్రతిసారి కాల్పులు జరిగిన తర్వాత, మా కేఫ్‌కి ఇంకా ఎక్కువమంది వచ్చారు. బిజినెస్ ఇంకా పెరిగింది. దేవుడు మనతో ఉంటే అంతా మంచే జరుగుతుంది” అని నవ్వుతూ చెప్పాడు. జూలై, ఆగస్టు, అక్టోబర్‌లలో మూడుసార్లు అటాక్స్ జరిగినా, సర్రేలోని తన ‘కప్స్ కేఫ్’ క్రేజ్ మాత్రం తగ్గలేదట.

అయితే, తన కేఫ్‌పై జరిగిన దాడులు కెనడా ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు కపిల్ తెలిపాడు. ఈ విషయం అక్కడి ఫెడరల్ గవర్నమెంట్ దాకా వెళ్లిందని, పార్లమెంట్‌లో కూడా చర్చ జరిగిందని చెప్పాడు. తన ఇన్సిడెంట్ తర్వాతే అక్కడ లా అండ్ ఆర్డర్ గురించి సీరియస్‌గా ఆలోచించడం మొదలుపెట్టారని, ఇప్పుడు కొత్త చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించాడు. చాలామంది తనకు ఫోన్ చేసి, ఈ విషయం న్యూస్ అవ్వడం వల్లే అక్కడ మార్పు వస్తోందని చెప్పారట.

Related Post

ఊపిరి పీల్చుకున్న విశ్వంభరఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్‌తో దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ఠ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం.. జగదేక వీరుడు

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేదన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చారు. మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌తో జరిగిన

వ‌ర్కింగ్ అవ‌ర్స్‌పై ర‌ష్మిక స్టాండ్?వ‌ర్కింగ్ అవ‌ర్స్‌పై ర‌ష్మిక స్టాండ్?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే 8 గంటల పని విధానంపై షరతులు పెట్టడాన్ని చాలామంది తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది డేట్లతో ముడిపడ్డ షూటింగ్స్‌లో టైమింగ్స్ పరంగా ఇంత కచ్చితంగా ఉంటే చాలా కష్టం అన్నది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.