hyderabadupdates.com Gallery తెలంగాణ ముద్దుబిడ్డ సూదిని జైపాల్ రెడ్డి

తెలంగాణ ముద్దుబిడ్డ సూదిని జైపాల్ రెడ్డి

తెలంగాణ ముద్దుబిడ్డ సూదిని జైపాల్ రెడ్డి post thumbnail image

హైద‌రాబాద్ : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన అరుదైన నాయ‌కుడు మాజీ కేంద్ర మంత్రి, దివంగ‌త సూదిని జైపాల్ రెడ్డి అని అన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాజకీయాలకు విలువల విలువ తెలిపి, ప్రజాసేవకు నిస్వార్థమే పరమార్థమని చెప్పిన అరుదైన నేత అని పేర్కొన్నారు. స్వరాష్ట్ర ఆవిర్భావ ప్రక్రియలో తన చాణక్య నీతి చూపిన తెలంగాణ ముద్దుబిడ్డ‌గా అభివ‌ర్ణించారు రేవంత్ రెడ్డి. శుక్ర‌వారం సూదిని జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హైద‌రాబాద్ లోని నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తిస్థల్ వద్ద సహచర నాయకులతో కలిసి ఘన నివాళి అర్పించారు. రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ సహచరులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఇక్కడ స్ఫూర్తి స్థల్ వద్ద జరిగిన జైపాల్ రెడ్డి 84వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు. తాను జైపాల్ రెడ్డిని చూసి స్పూర్తి పొందాన‌ని అన్నారు. అత్యుత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడ‌ని ఆయ‌న లాంటి నాయ‌కుడు మ‌ళ్లీ పుట్ట‌ర‌ని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. త‌ను ఊపిరి ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జ‌ల కోసం, రాష్ట్రం అభివృద్ది కోసం పాటు ప‌డ్డాడ‌ని, ఆయ‌న వ‌స్తున్నాడంటేనే పార్ల‌మెంట్, శాస‌న స‌భ ద‌ద్ద‌రిల్లేద‌ని గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఆయ‌న త‌మ‌కు బంధువు కావ‌డం కూడా గ‌ర్వంగా ఉంద‌న్నారు . పాల‌మూరు బిడ్డా నిను మ‌రువ‌దు ఈ గ‌డ్డ అని ఇప్ప‌టికీ త‌న గురించి స్మ‌రించు కుంటార‌ని పేర్కొన్నారు.
The post తెలంగాణ ముద్దుబిడ్డ సూదిని జైపాల్ రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శెభాష్ లోకేష్.. మంచి మాట ఎవ్వరు చెప్పినా..శెభాష్ లోకేష్.. మంచి మాట ఎవ్వరు చెప్పినా..

మంచి మాట ఎవ్వరు చెప్పినా వినాలంటారు పెద్దలు. నాకు తోచింది మాత్రమే చేసుకుంటూ పోతాననే మోనార్క్ పోకడలు లేకుండా.. పెద్దా చిన్నా స్థాయీ భేదాలను ఎంచకుండా మంచి సలహా ఎవ్వరు చెప్పినా సరే.. విని, ఆచరించడానికి పూనుకున్నప్పుడే.. పాలకులు కూడా న్యాయం

సంజు సామ్సన్ ఒక క్లాస్ ప్లేయర్ : సూర్య కుమార్సంజు సామ్సన్ ఒక క్లాస్ ప్లేయర్ : సూర్య కుమార్

శ్రీ‌లంక : భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. యావ‌త్ ప్ర‌పంచం ఈనెల 15న ఆదివారం శ్రీ‌లంక‌లో అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ దాయాదుల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే టికెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. ఈ సంద‌ర్బంగా

జ‌న‌సేన పార్టీ స‌భ్య‌త్వానికి ప‌వ‌న్ రూ. 2 కోట్లు విరాళంజ‌న‌సేన పార్టీ స‌భ్య‌త్వానికి ప‌వ‌న్ రూ. 2 కోట్లు విరాళం

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం, జన‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆదివారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీకి సంబంధించి క్రియాశీల‌క స‌భ్య‌త్వ నమోదు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్బంగా త‌న